PM Modi: సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
- భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు..
- సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ ఫోన్..
- సరిహద్దు ప్రాంతాల్లో భద్రతాపై ప్రధాని మోడీ ఆరా..
PM Modi: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దాయాది దేశం.. ఇప్పుడు మనపై రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ట్రై చేస్తుంది. వీటిని భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా, సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యంగా పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడారు.
Read Also: Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!
Also Read
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
- DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో భద్రతా సన్నద్ధతపై ప్రధాని మోడీ ఆరా తీసి అక్కడ ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అయితే, భద్రతాపరంగా సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్ నగర్లో పౌరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భద్రతా చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఇవన్నీ పాక్తో సరిహద్దు కలిగిన ప్రాంతాలు కావడంతో మరింత పటిష్టమై భద్రతా ఏర్పా్ట్లను చేయాలని సూచించారు. అయితే, ప్రస్తుతం పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండటంతో.. సరిహద్దు జిల్లాల్లో అధికార యంత్రాంగం అలర్టైంది. ఎప్పటికప్పుడు అధికారులు ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారు.
Read Also: Operation Sindoor : నిన్న పాక్ అవాక్స్ వ్యవస్థను భారత్ కూల్చేసిందా.. పాక్ కు పెద్ద దెబ్బే
మరోవైపు, భారత్- పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే రక్షణ శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆర్థిక, హోం, ఆరోగ్య శాఖల్లోనూ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. తమ మంత్రి వర్గంలోని ఉన్నతాధికారులతో ఆయా కేంద్రమంత్రులు వరుస సమావేశాలు అవుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆర్థికపరంగా సన్నద్ధత, ఆరోగ్య సేవల అందుబాటు తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!