PM Modi: ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
- ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం..
- ‘‘మిత్ర విభూషణ’’ ద్వారా గౌరవించిన ద్వీప దేశం..
- ఇరు దేశాల స్నేహానికి గుర్తుగా అవార్డు ప్రదానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. శ్రీలంక-భారత్ సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో ప్రధాని మోడీ అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శనివారం ద్వీప దేశం ఈ అవార్డును అందించింది. ‘‘మిత్ర విభూషణ’’ పతకం ద్వారా శ్రీలంక మోడీని గౌరవించింది. ఇది స్నేహం, వారసత్వాన్ని సూచిస్తుంది. ప్రధాని మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా శ్రీలంకలో పర్యటిస్తున్నారు.
Read Also: CBI Raids: చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా 18 చోట్ల దాడులు
Also Read
‘‘ఇది నాకు గర్వకారణమైన క్షణం. ఇది నాకు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులకు గౌరవం. ఇది శ్రీలంక, భారతదేశ ప్రజల మధ్య చారిత్రక సంబంధాన్ని, లోతైన స్నేహాన్ని చూపిస్తుంది. ఈ అవార్డు ప్రదానం చేసినందుకు అధ్యక్షుడు, శ్రీలంక ప్రభుత్వం, ఇక్కడి ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ఆయన అన్నారు.
అనుర కుమార దిస్సానాయకే పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటిసారిగా ఆయన భారతదేశానికి వచ్చారని, ఆయన ఎన్నికైన తర్వాత మొదటి అంతర్జాతీయ నాయకుడిగా తాను శ్రీలంకకు వచ్చానని, ఇది మా సంబంధాల లోతును తెలియజేస్తుందని ఆయన అన్నారు. 2019 బాంబు దాడులు, కోవిడ్-19 సమయంలో భారత్ శ్రీలంక కష్టకాలంలో అండగా నిలబడిందని మోడీ అన్నారు. ‘‘మిత్ర విభూషణ’’ పతకం రెండు దేశాల మధ్య సంబంధాల పటిష్టతను తెలియజేస్తుందని చెప్పారు. శ్రీలంక అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీకి ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?