BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..
- ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి..
- సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం..
- వక్ఫ్ చట్టం విచారణపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చే వరకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలోకి ముస్లింయేతరుల నియామకాలు జరగవని కేంద్రం నుంచి సుప్రీంకోర్టుకు హామీ లభించింది. ఇప్పటికే నోటిఫై చేయబడిన లేదా నమోదు చేయబడిన “వక్ఫ్-బై-యూజర్” ఆస్తులతో సహా ఏ వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని, ఈ కాలంలో జిల్లా కలెక్టర్లు వాటి స్థితిని మార్చరని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా కోర్టు రికార్డ్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు దీనిపై స్టేటస్ కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
Read Also: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
ఈ వ్యవహారంపై పలువురు బీజేపీ ఎంపీలు సుప్రీంకోర్టుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలు చేయాలనుకుంటే, పార్లమెంట్ ఉనికిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలి అని దూబే ఎక్స్ పోస్టులో పరోక్షంగా సుప్రీంకోర్టు సమీక్షల్ని ప్రస్తావించారు. ఈ చట్టంపై కేంద్రం తన ప్రతిస్పందన తెలియజేయడానికి ఒక వారం సమయం ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.
1995 వక్ఫ్ చట్టానికి 2025 సవరణల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్ , కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా రెండవ రోజు కూడా పిటిషన్లను విచారించింది. బుధవారం జరిగిన విచారణలో వక్ఫ్ చట్టంలోని అనేక నిబంధనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని నిబంధనలు రాజ్యాంగ పరిశీలనలో ఉండకపోవచ్చని సూచించింది.
क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!