BJP MP: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు.
Nishikant Dubey: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ ఇటీవల కాంగ్రెస్ ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటును, అమెరికాను లెక్కచేయని తెగువను ప్రశంసించింది. అయితే, తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇందిరాగాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. భారతదేశం 1968లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించిందని, దీని ఫలితంగా 1965 భారత్-పాక్ యుద్ధంలో గెలిచినప్పటికీ, రాన్ ఆఫ్ కచ్లోని 828 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్కు అప్పగించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శనివారం విమర్శించారు.
BJP MP: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు. 2025 నాటికి పాకిస్తాన్ ఒక దేశంలో ఉనికిలో లేకుండా పోతుందని చెప్పారు. ఆదివారం, ఆదివారం జార్ఖండ్లోని దేవఘర్ జిల్లాలో మహేశ్మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని అన్నారు.
BJP MP: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, రాష్ట్రపతికి బిల్లుల విషయంలో సుప్రీంకోర్ట్ డెడ్లైన్ విధించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీలోకి కొంత మంది సుప్రీంకోర్టుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, సుప్రీంకోర్టుపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మత యుద్ధాలను ప్రేరేపిస్తోందని.. దీనికి న్యాయస్థానమే బాధ్యత వహించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
BJP MP: సుప్రీంకోర్టు తీరుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీదానికి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తే పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీని మూసేయాలని ఆయన అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై దూసే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా బలమైన పదజాలాన్ని ఉపయోగించారు. దేశంలో మతపరమైన హింసను ప్రేరేపించడానికి సుప్రీంకోర్టుదే బాధ్యత అని, దాని పరిధిని మించి వ్యవహరిస్తోందని అన్నారు. దేశ రాజ్యాంగాన్ని అనుసరించడం ద్వారా ఏర్పడిన చట్టాన్ని…
BJP MP: పార్లమెంట్ ఉభయసభల ఆమోదం, రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని బుధవారం నుంచి అత్యున్నత న్యాయస్థానం విచారించడం ప్రారంభించింది. ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డులో చేర్చడం, వక్ఫ్ బై యూజర్ వంటి ఆస్తుల్ని డీనోటిఫై చేయడం వంటి చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు వాదించారు.
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై దూషిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ శుక్రవారం ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రలపై సభాహక్కుల తీర్మానాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్ నడపకుండా చేసే కుట్రలో ఇదొక భాగమని, వారు అదానీ ఇష్యూకి భయపడి దాని నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది.
Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవడంతో త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అందరూ లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రాంచీ రావాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారట. తాజా…