Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..
- దొంగతనం చేశారని దారుణంగా హింసించిన యజమాని..
- కరెంట్ షాక్లు ఇస్తూ, వేళ్ల గోళ్లను పీకేసి చిత్రిహింసలు..
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తన వర్కర్లపై కర్కషంగా ప్రవర్తించాడు. ఇద్దరు కార్మికులను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశాడు. దొంగతనం చేశారనే అనుమానంతో వారిద్దరికి కరెంట్ షాక్లు ఇస్తూ, గోళ్లు ఊడపీకి హింసించాడని శనివారం పోలీసులు తెలిపారు. రాజస్థాన్ భిల్వారా జిల్లాకు చెందిన అభిషేక్ భంబి, వినోద్ భంబి అనే ఇద్దరు బాధితులను ఒక కాంట్రాక్టర్ ద్వారా కోర్బా జిల్లాలోని గుర్జార్ యాజమాన్యంలోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి నియమించుకున్నారు.
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ లీడర్ హత్య.. భారత్ ఆగ్రహం..
Also Read
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ఏప్రిల్ 14న గుర్జార్, అతడి సహచరుడు ముఖేష్ శర్మ ఇద్దరు కార్మికులపై దొంగతనం ఆరోపణలు చేశారు. వీరిద్దరి బట్టలు విప్పి, విద్యుత్ షాక్ ఇచ్చి, వారి గోళ్లను వేళ్ల నుంచి బయటకు తీసి హింసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియో క్లిప్లో అర్ధనగ్నంగా ఉన్న వ్యక్తికి విద్యుత్ షాక్ ఇచ్చి కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు బాధితులు తప్పించుకని భిల్వారాలోని వారి స్వస్థలానికి చేరకున్న తర్వాత గులాబ్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజస్థాన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కోర్బా పోలీసులకు కేసును పంపారు. శుక్రవారం కోర్బాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో గుర్జార్, శర్మలపై కేసు నమోదైంది. బాధితుల్లో ఒకరైన అభిషేక్ భంభి తన వాహనం ఇన్స్టాల్మెంట్ కోసం యజమాని నుంచి రూ. 20,000 అడ్వాన్స్గా అడిగానని, యజమాని అందుకు నిరాకరించడంతో ఉద్యోగం మానేస్తానని చెప్పానని, దీంతో అతడికి కోపం వచ్చి తమపై దాడికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
-
Kiara: యష్’తో అప్పుడు ఇష్టమై చేశా కానీ… ఆ సీన్లు ఇప్పుడు కట్ చేయండి ప్లీజ్!
-
Tamil Producers: టోకెన్ స్ట్రైక్’కి దిగిన తమిళ నిర్మాతలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!