Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు వెళ్లననున్నారు. దీనికి సంబంధించిన పత్రంలో ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు. దీంతోొ మరోసారి ఇండియా పేరు భారత్ గా మారుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.
Also Read
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
Read Also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఆహ్వానానికి సంబంధించిన నోట్ ను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఇందులో ‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’తో పాటు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ పోస్టులు ‘‘ మోడీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి..20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి పెట్టుకోవడంతోనే ఇదంతా డ్రామా’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరును భారత్ గా మార్చుకుంటే, ఆ పార్టీ భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..? ఈ దేశం ఒక్కపార్టీది కాదని 140 కోట్ల మందిదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు భారత్ అనే పదాన్ని స్వాగతిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ దీనికి మద్దతు తెలిపారు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టతను పెంచే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డు చెబుతోందని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
-
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!