Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు వెళ్లననున్నారు. దీనికి సంబంధించిన పత్రంలో ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు. దీంతోొ మరోసారి ఇండియా పేరు భారత్ గా మారుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.
Also Read
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
- Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
Read Also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఆహ్వానానికి సంబంధించిన నోట్ ను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఇందులో ‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’తో పాటు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ పోస్టులు ‘‘ మోడీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి..20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి పెట్టుకోవడంతోనే ఇదంతా డ్రామా’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరును భారత్ గా మార్చుకుంటే, ఆ పార్టీ భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..? ఈ దేశం ఒక్కపార్టీది కాదని 140 కోట్ల మందిదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు భారత్ అనే పదాన్ని స్వాగతిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ దీనికి మద్దతు తెలిపారు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టతను పెంచే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డు చెబుతోందని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
-
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
-
Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!