Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat: కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మారుస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ.. నిన్ని జీ20 విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెండ్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రచురించడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 18-22 మధ్య జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ పేరు మార్పుపై బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం చర్యలను కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పలు పార్టీలు విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు వెళ్లననున్నారు. దీనికి సంబంధించిన పత్రంలో ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’’కు బదులుగా ‘‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’’గా పేర్కొన్నారు. దీంతోొ మరోసారి ఇండియా పేరు భారత్ గా మారుతుందనే ఊహాగానాలు బలపడ్డాయి.
Also Read
Read Also: Google vs Teachers: గురువుల కన్నా గూగుల్ మిన్న..! ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ ఆహ్వానానికి సంబంధించిన నోట్ ను ఎక్స్(ట్విట్టర్)లో పంచుకున్నారు. ఇందులో ‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’తో పాటు ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ అని కూడా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ పోస్టులు ‘‘ మోడీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి..20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమి పెట్టుకోవడంతోనే ఇదంతా డ్రామా’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్రం చర్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పేరును భారత్ గా మార్చుకుంటే, ఆ పార్టీ భారత్ పేరును బీజేపీగా మారుస్తుందా..? ఈ దేశం ఒక్కపార్టీది కాదని 140 కోట్ల మందిదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు భారత్ అనే పదాన్ని స్వాగతిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ దీనికి మద్దతు తెలిపారు. బీజేపీ జాతీయాద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టతను పెంచే ప్రతీ పనికి కాంగ్రెస్ అడ్డు చెబుతోందని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!