Sachin Pilot: సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియా గాంధీ కాదు వసుంధర రాజే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిల్ పైలెట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్రంలో అవినీతి సమస్యలపై సచిన్ పైలట్ అజ్మీర్ నుంచి జైపూర్ వరకు మే 11న ‘జన్ సంఘర్ష్ యాత్ర’ చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం గెహ్లాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ అధిష్టానం సోనియాగాంధీ కాదని, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అని అన్నారు.
Read Also: Aeolus: భూమిపై క్రాష్ కాబోతున్న1360 కిలోల శాటిలైట్..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ధనబలం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు వసుంధర రాజే, కౌలాష్ మేఘ్వాల్ మద్దతు ఇవ్వడానికి నిరాకరించానని, 2020లో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నుంచి బయటపడినట్లు గెహ్లాట్ ప్రకటించిన ఒక రోజు తర్వాత సచిన్ పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గెహ్లాట్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. గెహ్లాట్ తన పార్టీలో తిరుగుబాట్ల కారణంగా అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను విమర్శించడం, బీజేపీ నేతలను పొగడడం, కాంగ్రెస్ నేతల్ని అప్రతిష్టపాలు చేయడం తప్పని గెహ్లాట్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ సచిన్ పైలట్ అన్నారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. అధిష్టానం ఎన్నిసార్లు ఈ గొడవల్ని సరిచేద్ధాం అనుకున్నా.. మళ్లీ మొదటికే వస్తున్నాయి. 2020లో సచిన్ పైలట్, 18 మంది ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో సచిన్ పైలట్ బీజేపీ మద్దతు ఇస్తారని అనుకున్నప్పటికీ.. అధిష్టానం కలుగజేసుకోవడంతో నెల రోజుల్లో సంక్షోభం చక్కబడింది. అయితే పైలట్ తన ఉపముఖ్యమంత్రి పదవిని, పీసీసీ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!