Covid 19: మళ్లీ కోవిడ్ భయం.. విద్యాసంస్థలకు సెలవుల్లో నిజమెంతా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.. విద్యా వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించింది.. చదువులను నాశనం చేసింది మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, యూవనిర్సిటీలు.. ఇలా విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. దాంతో, ఆన్లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు విద్యార్థులు.. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా? అని ప్రతీ విద్యార్థి చేతికి స్మార్ట్ఫోన్ వచ్చింది.. చదవువులు తక్కువ..! ఆన్లైన్ గేమ్లు ఎక్కువ అనే పరిస్థితి తీసుకొచ్చింది.. అయితే, మహమ్మారి తగ్గుముఖం పట్టి.. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత యథావిథిగా విద్యాసంస్థలు నడుస్తున్నాయి.. అయితే, ఇప్పుడు కొత్త వేరియంట్ భయాలు వెంటాడుతున్నాయి.. ఈ తరుణంలో.. త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..
Read Also: BF-7 Covid Variant: బెంగాల్లో బీఎఫ్-7 కలకలం.. అమెరికా నుంచి వచ్చిన 4గురిలో గుర్తింపు
Also Read
- India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
- Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
- Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
ఆ ప్రచారంలో నిజం ఎంత అనిదానిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.. ఇదంతా నిరాధారమైనది.. ఫేక్ న్యూస్ అని తేల్చేసింది.. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసింది.. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్లో పోస్టు చేసింది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, జనవరి 4, బుధవారం, భారతదేశంలో 175 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, చలిగాలుల దృష్ట్యా లక్నోలోని పాఠశాలలను మూసివేయాలని ఆదేశించబడింది. జమ్మూ మరియు కాశ్మీర్, ఢిల్లీతో సహా రాష్ట్రాల్లో శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేయబడ్డాయి. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ, కరోనా మహమ్మారి కారణంగా ఇచ్చిన సెలవులు కాదని స్పష్టం చేస్తున్నారు.
सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck
✅ ये सभी दावे फ़र्ज़ी हैं।
✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn
— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023
తాజావార్తలు
-
Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
-
Stock Market: యుద్ధం ముగింపు వార్తలతో.. భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు..
-
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్కు ముగింపు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!