Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..
- ఫడ్నవీస్ కు సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్..
- దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయవద్దని వాదిస్తున్న బీజేపీలో కొందరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read Also: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
కాగా, ఈ క్రమంలోనే మహారాష్ట్ర నెక్ట్స్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్కే అజిత్ పవార్ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం జరిగిన భేటీలో ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 స్ఠానాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. అయితే, అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్.. బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాగా, సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే ఛాన్స్ ఉంది.
Read Also: Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
అయితే, మరోవైపు నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని శివసేన (షిండే) వర్గానికి చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ ప్రకటించారు. తొలి విడుతలో సీఎంతో పాటు 21 మంది మంత్రులతో సర్కార్ కొలువుదీరనున్నదని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎం మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చు. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచి 21, శివసేన (షిండే) నుంచి 12, ఎన్సీపీ (అజిత్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా ఛాన్స్ లభించవచ్చని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!