Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..
- ఫడ్నవీస్ కు సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్..
- దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయవద్దని వాదిస్తున్న బీజేపీలో కొందరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read Also: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
కాగా, ఈ క్రమంలోనే మహారాష్ట్ర నెక్ట్స్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్కే అజిత్ పవార్ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం జరిగిన భేటీలో ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 స్ఠానాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. అయితే, అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్.. బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాగా, సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే ఛాన్స్ ఉంది.
Read Also: Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
అయితే, మరోవైపు నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని శివసేన (షిండే) వర్గానికి చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ ప్రకటించారు. తొలి విడుతలో సీఎంతో పాటు 21 మంది మంత్రులతో సర్కార్ కొలువుదీరనున్నదని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎం మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చు. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచి 21, శివసేన (షిండే) నుంచి 12, ఎన్సీపీ (అజిత్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా ఛాన్స్ లభించవచ్చని తెలుస్తుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!