Maharashtra CM: అజిత్ పవార్ సపోర్టుతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
- మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..
- ఫడ్నవీస్ కు సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్..
- దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయవద్దని వాదిస్తున్న బీజేపీలో కొందరు
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. దీంతో ఎవరు సీఎం పీఠాన్ని దక్కించుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Read Also: IND vs AUS: విజయానికి అతి చేరువలో భారత్.. మరో రెండు వికెట్లు అంతే
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
కాగా, ఈ క్రమంలోనే మహారాష్ట్ర నెక్ట్స్ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్కే అజిత్ పవార్ సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆదివారం జరిగిన భేటీలో ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు మహాయుతి కూటమి 235 స్ఠానాల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది. అందులో బీజేపీ 132 సీట్లతో ప్రధాన పార్టీగా నిలిచింది. అయితే, అధికారం చేపట్టడానికి 145 మ్యాజిక్ ఫిగర్.. బీజేపీ దానికి చాలా దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కాగా, సీఎంగా ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని భారతీయ జనతా పార్టీలోని కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ సస్పెన్స్కు 24 గంటల్లో తెరపడే ఛాన్స్ ఉంది.
Read Also: Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
అయితే, మరోవైపు నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని శివసేన (షిండే) వర్గానికి చెందిన మంత్రి దీపక్ కేసర్కర్ ప్రకటించారు. తొలి విడుతలో సీఎంతో పాటు 21 మంది మంత్రులతో సర్కార్ కొలువుదీరనున్నదని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎం మినహా మరో 43 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చు. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచి 21, శివసేన (షిండే) నుంచి 12, ఎన్సీపీ (అజిత్) పార్టీ నుంచి 10 మందికి మంత్రులుగా ఛాన్స్ లభించవచ్చని తెలుస్తుంది.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!