Meerut: ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ‘‘గడ్డం’’ కారణంగా ఓ మహిళ లేచిపోయింది. గడ్డం షేవ్ చేసుకోవాలని పదే పదే మహిళ అభ్యర్థించినప్పటికీ భర్త అందుకు అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ తన బావతో పారిపోయింది. మీరట్లోని ఉజ్జ్వాల్ గార్డెన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.
ముస్లిం మతాధికారి షకీర్ అనే వ్యక్తికి అర్షి అనే యువతితో 7 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత నుంచి భార్య అతడిని గడ్డం తీయాలని ఒత్తిడి చేసింది. ‘‘కుటుంబ ఒత్తిడితోనే నిన్ను వివాహం చేసుకున్నానని, గడ్డం తీస్తేనే కలిసి సంసారం చేస్తానని’’ అర్షి తనతో చెప్పినట్లు షకీర్ ఆరోపించాడు. దీనిపై అర్షి కుటుంబానికి షకీర్ ఫిర్యాదు చేశాడు.
Read Also: YS Jagan: సింహాచలం ఘటన మృతుల కుటుంబాలకు జగన్ పరామర్శ.. ఇది ప్రభుత్వ వైఫల్యమే..!
ఇదే సమయంలో, అర్షి షకీర్ తమ్ముడితో రిలేషన్ ప్రారంభించింది. చివరకు వీరిద్దరు ఫిబ్రవరి 3న ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా షకీర్, అతడి కుటుంబం షాక్కి గురైంది. కుటుంబం పరువు పోతుందని షకీర్ తన బంధువుల సాయంతో వారిని కనుగొనే ప్రయత్నం చేశాడు, కానీ వారిద్దరి ఆచూకీ లభించలేదు.
చివరకు షకీర్ తన భార్య, తమ్ముడిపై మిస్సింగ్ కంప్లైట్ దాఖలు చేశాడు. అర్షి కుటుంబానికి కూడా లేచిపోయిందనే సమాచారాన్ని ఇచ్చాడు. అయితే, కుటుంబం జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కుటుంబం అర్షితో అన్ని సంబంధాలను తెంచుకున్నట్లు చెప్పింది. అర్షి తనను రూ. 5 లక్షలు డిమాండ్ చేస్తుందని షకీర్ ఆరోపించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఆయుష్ విక్రమ్ ధృవీకరించారు.