Pakistan: పీఓకే, గిల్గిత్కి అన్ని విమానాలు రద్దు.. పాక్ ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్..
- హై అలర్ట్లో పాకిస్తాన్..
- ఎయిర్ పోర్టుల్లో భద్రతా పోట్రోకాల్ పెంపు..
- ఇస్లామాబాద్, రావల్పిండిలో F-16లు మోహరింపు..
- పీఓకే, గిల్గిత్కి అన్ని విమానాలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి చేస్తోంది.
Read Also: Madras High Court: మైనర్తో లైంగిక సంబంధం పెట్టుకుంటే “వివాహం” రక్షించదు.. పోక్సో చట్టంపై హైకోర్ట్..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ హై అలర్ట్ అవుతోంది. భారత్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే), గిల్గిట్-బాల్టిస్తాన్లోని పలు ప్రాంతాలకు విమానాలను క్యాన్సల్ చేసింది. గిల్గిట్, స్కర్డుతో పాటు పీఓకేలోని పలు ప్రాంతాలకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) కరాచీ, లాహోర్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలను, ఇస్లామాబాద్ నుంచి స్కర్దు వెళ్లే రెండు విమానాలను, ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్లే 4 విమానాలను రద్దు చేసింది.
భారత్తో పెరిగిన ఉద్రిక్తతలతో పాక్ తన గగనతలాన్ని హై అలర్ట్లో ఉంచింది. పాకిస్తాన్ అధికారులు అన్ని విమానాశ్రయాలను హై అలర్ట్లో ఉంచారు. భద్రత, నిఘా ప్రోటోకాల్ని గణనీయంగా పెంచారు. రావల్పిండి, ఇస్లామాబాద్లను రక్షించడానికి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ F-16 విమానాలను మోహరించింది. భారత్ దూకుడు వైఖరి కారణంగా పాకిస్తాన్ సియాల్కోట్ నుంచి ఆర్టిలరీ రెజిమెంట్ని ఇస్లామాబాద్కి తరలించింది. రావల్పిండిన రక్షించడానికి ఫైటర్ జెట్లను మోహరించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!