Funny Incident: ఉత్తర్ ప్రదేశ్లోని మీరట్ నగరంలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, ‘‘ఫస్ట్ నైట్’’ రోజే అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. ఈ పరిణామం వరుడి కుటుంబీకులను ఆందోళనకు గురి చేసింది. వివాహం అయిన రోజే అదృశ్యం కావడంతో వారంతా భయపడిపోయారు. మొహిసిన్ అనే వ్యక్తికి 5 రోజుల క్రితం ముజఫర్ నగర్ లో వివాహం జరిగింది. పెళ్లి రాత్రి, అతడి భార్య గదిలో వేచి చూస్తూ ఉంది. అయితే, గది…
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సినిమా తరహాలో ఓ దారుణ సంఘటన వెలుగుచూసింది. స్నేహితుడిపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి ప్రాణాలు తీశాడు. అనంతరం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో వైరల్గా మారింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. దేశానికి సేవ చేసే ఆర్మీ జవాన్ను అత్యంత దారుణంగా టోల్ సిబ్బంది దాడి చేశారు. స్తంభానికి కట్టేసి కనికరం లేకుండా కర్రలతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవలి కాలంలో పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. గొడవల కారణంగా విడాకులు తీసుకోవడం, అక్రమ సంబంధాలు, ప్రియుడు లేదా ప్రియురాలితో పారిపోవడం వల్ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. ఇదీకాకుండా నాగరిక సమాజంలో వరకట్న వేధింపులు నవ వధువుల మృతికి కారణమవుతున్నాయి. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అగుడు పెట్టిన కొత్త కోడళ్లను అదనపు కట్నం కోసం వేధిస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా మీరట్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే కట్నం కావాలంటూ వివాహితను భర్త,…
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Meerut: ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో ఓ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ‘‘గడ్డం’’ కారణంగా ఓ మహిళ లేచిపోయింది. గడ్డం షేవ్ చేసుకోవాలని పదే పదే మహిళ అభ్యర్థించినప్పటికీ భర్త అందుకు అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ తన బావతో పారిపోయింది. మీరట్లోని ఉజ్జ్వాల్ గార్డెన్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.
వామ్మో.. మీరట్లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్నటికి మొన్న భర్తను ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా చంపేసి.. అనంతరం ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్తో కప్పేశారు. ఈ దారుణాన్ని ఇంకా మరువక ముందే మరో ఘోరం మీరట్లో వెలుగుచూసింది.
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సౌరభ్ భార్య ముస్కాన్ గర్భవతిగా నిర్ధారణ అయింది. జైలు అధికారుల అభ్యర్థన మేరకు జిల్లా ఆస్పత్రి నుంచి ఒక టీమ్ సోమవారం జైలులో ఆమెకు పరీక్షలు చేసింది. ఈ పరీక్షల్లో ముస్కాన్ రస్తోగి గర్భవతి అని తేలింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా ముస్కాన్ ప్రెగ్నెన్సీని ధ్రువీకరించారు.
Blue Drum Sales: ఇటీవల దేశవ్యాప్తంగా మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్పుత్ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. విదేశాల్లో పనిచేసే సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు దారుణంగా హత్య చేశారు. గుండెల్లో పొడిచి, గొంతు కోసి హతమార్చాడు. చివరకు శరీరాన్ని 15 ముక్కలుగా చేసి, ఒక డ్రమ్లో సిమెంట్ వేసి కప్పేవారు. ఈ ఘటన తర్వాత…
UP: రంజాన్ సందర్భంగా ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయవద్దని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోరారు. ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, పాస్పోర్టు, లెసెన్సులు క్యాన్సల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఈ రోజు ఈద్ ప్రార్థనల సందర్భంగా మీరట్ రోడ్లపై నమాజ్ చేయడాన్ని అడ్డుకోవడంతో నిరసనకారులు నిరసన చేపట్టారు.