Manipur Violence: మణిపూర్ హింసలో 54 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.
ఇదిలా ఉంటే ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 54 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చనిపోయిన 54 మందిలో 16 మృతదేహాలను చురచంద్పూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. అనధికారికంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దుకాణాలు, మార్కెట్లు తిరిగి తెరవడం, వాహనాలు రోడ్లపైకి రావడంతో శనివారం ఇంఫాల్ లోయలో జనజీవనం జాగ్రత్తగా సాధారణ స్థితికి చేరుకుంది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. ఎయిరిండియా ఫ్లైట్లో ఘటన
చురచంద్పూర్, మోరె, కక్చింగ్, కాంగ్పోక్పి జిల్లాలను సైన్యం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. 13,000 మందిని రక్షించి సురక్షిత ఆశ్రయాలకు తరలించామని, కొంతమంది ఆర్మీ క్యాంపుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు. మణిపూర్ లోని మెజారిటీ కమ్యూనిటీ అయిన మైతైకి గిరిజన హోదా కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. మైతై కమ్యూనిటీకి, కొండ ప్రాంతాల్లో నివసించే నాగా, కుకీలకు మధ్య ఘర్షణ తలెత్తింది. దీన్ని నిరసిస్తూ ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) బుధవారం నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’ సందర్భంగా చురాచంద్పూర్ జిల్లాలోని టోర్బంగ్ ప్రాంతంలో మొదట హింస చెలరేగింది. ఇది నెమ్మదిగా ఇతర ప్రాంతాలకు వ్యాపించింది.
మైతై కమ్యూనిటీ ఎస్టీ హోదా డిమాండ్ పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో నాగాలు మరియు కుకీలతో సహా గిరిజనులు మార్చ్ నిర్వహించారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మైతై వర్గానికి చెందిన వారు. వీరంతా ఇంఫాల్ లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. 40 శాతం ఉన్న కుకీలు, నాగాలు, ఇతర గిరిజనులు కొండ ప్రాంతాల్లో నివసిస్తుంటారు.
తాజావార్తలు
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!