మణిపూర్లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి.
మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు అని అమెరికా సింగర్ మేరీ మిలి బెన్ అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్ సమస్యపై ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇచ్చారు.
మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోడీతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు ఓ లేఖ రాశారు.
మోడీ సర్కార్ పై ప్రతిపక్షాల కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు మూడో రోజు చర్చకు రానుంది. ఎన్డీఏపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది.
మీరు మణిపూర్లో భారత మాతను చంపేశారు.. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహలు.. మణిపూర్ను రెండు భాగాలుగా విభజించారు.. మోడీకి ఈ దేశ గుండె చప్పుడు వినే సమయం లేదు.. మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటారు అంటూ రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది.. మణిపూర్కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్ వెళ్లారు, మోడీ ఎందుకు వెళ్లలేదు? మణిపూర్ తగలబడుతుంటే.. భారత్ తగలబడుతున్నట్లేనని ఆయన తెలిపారు.
మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జాతి హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుతో పాటు పునరావాసం, ఇతర అంశాలను కూడా పరిశీలించేందుకు ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.
సుప్రీకోర్టు స్పందించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు అని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ లాగా మారిపోయింది. విపక్ష కూటమి పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వ్యతిరేకించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.