Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. ఎయిరిండియా ఫ్లైట్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: వరసగా పలు వార్తల్లో చర్చనీయాంశంగా మారుతోంది ఎయిర్ ఇండియా. ఈ ఏడాది మొదట్లో ఓ ప్రయాణికుడు మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా మరో ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. విమానంలో ప్రయాణిస్తున్న మహిళను తేలు కుట్టింది. ఈ ఘటన గత నెలలో నాగ్పూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. విమానాశ్రయంలో ల్యాండింగ్ అయిన తర్వాత బాధితురాలు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సంస్థ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Bombay High Court: 80 ఏళ్ల న్యాయ పోరాటం.. 93 ఏళ్ల వయసులో మహిళ విజయం..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఏప్రిల్ 23, 2023న ఎయిర్ ఇండియా ఏఐ630లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలని తేలు కాటువేసిందని, ఇది అత్యంత అరుదైన, దురదృష్టకరమైన సంఘటన అని, మా అధికారులు బాధితురాలితో పాటు ఆసుపత్రికి వెళ్లారని,డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమెకు అన్ని సహాయాన్ని అందించారు ఎయిరిండియా ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని మొత్తం తనిఖీ చేసి తేలును గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను పక్కాగా తనిఖీ చేయాలని కోరింది.
ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి ఎయిరిండియా క్షమాపణ కోరింది. గతంలో కూడా ఇలాగే కొన్ని విమానాల్లో పాములు, కీటకాలు కనుగొనబడ్డాయి. గతేడాది డిసెంబర్లో కాలికట్ నుంచి దుబాయ్ విమానాశ్రయంలో దిగిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కార్గో హోల్డ్లో పాము కనిపించింది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!