Manipur: మణిపూర్లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
ప్రధాని మోడీ మణిపూర్ టూర్పై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ విమర్శలు గుప్పించారు. జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్లో పర్యటించడం దురదృష్టకరం అన్నారు. ఇది ప్రధానుల సంప్రదాయం కాదని పేర్కొన్నారు.
ధైర్యం, ధైర్యసాహసాలకు మణిపూర్ నిలయం అని ప్రధాని మోడీ అన్నారు. రెండు జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రెండేళ్లకు మణిపూర్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. ఉదయం ఇంఫాల్కు చేరుకున్న ప్రధాని.. అక్కడ నుంచి రోడ్డుమార్గంంలో చరాచంద్పూర్ చేరుకున్నారు.
PM Modi: 2023లో మణిపూర్లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.
Manipur : మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, రాకెట్ల వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Manipur:మణిపూర్లో ఇటీవల కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన నలుగురిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజాగా వీరందరిని హత్య చేసినట్లు తెలిసింది. చనిపోయిన వారిలో తండ్రీ, అతని కొడుకు కూడా ఉన్నారు. చురచంద్ పూర్, బిష్ణుపూర్ జిల్లాల మధ్య కొండల్లో మిలిటెంట్లు నలుగురు గ్రామస్తులను కిడ్నా్ప్ చేశారు. శీతాకాలం కావడంతో మంట కోసం కట్టెలు తీసుకువచ్చేందుకు సమీప అడవుల్లోకి వెళ్లిన సమయంలో వారిని అపహరించారు. వీరందర్ని మిలిటెంట్లు చంపినట్లుగా ఈ రోజు పోలీసులు వెల్లడించారు.
మణిపూర్లోని చురచంద్పూర్లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
Manipur Violence: గత నాలుగు నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా 175 మంది మరణించారు. చాలా మంది సొంత ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పరిస్థితి శాంతియుతంగా మారుతుందనుకునే సమయంలోనే మళ్లీ అల్లర్లు మొదలువుతున్నాయి. ఇటీవల ఇద్దరు మెయిటీ విద్యార్థులను మిలిటెంట్లు చంపడం మరోసారి ఆ రాష్ట్రంలో విధ్వంసానికి కారణమైంది. ఏకంగా సీఎం బీరెన్ సింగ్ ఇంటిపైనే ఆందోళనకారులు దాడికి తెగబడ్డారు.
Manipur Violence: గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంతో మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. స్కూళ్లు, వాహనాలు, చర్చిలకు ఆందోళనకారులు నిప్పుపెడుతున్నారు. సైన్యం, పారామిలిటీ బలగాలను రాష్ట్రంలో మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సైన్యం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. సైన్యం, అస్సాం రైఫిల్స్ నుంచి 10,000 మంది సైనికులు మోహరించారు.