Madhya Pradesh: భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై రేపటి నుంచి ఏఎస్ఐ సర్వే..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్లోని వివాదాస్పద భోజ్శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం గతంలో మతఘర్షణలకు కారణమైంది. రెండు వర్గాలు కూడా దీనిపై తమకే హక్కులు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదాస్పద ప్రాంతం నిజ స్వరూపం, స్వభావాన్ని నిర్ధారించేందుకు హైకోర్టు ఆదేశించింది. ఏఎస్ఐ సర్వే నేపథ్యంలో ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సర్వే పనులకు అందరూ సహకరించాలని ధార్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: Actress Accident: ఇంకా విషమంగానే జయలక్ష్మీ ఆరోగ్యం.. విరాళాల కోసం కుటుంబం ఎదురు చూపులు!
Also Read
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు ఎస్ఏ ధర్మాధికారి, దేవనారాయణ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్, ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది. భోజ్శాలను సరస్వతి ఆలయంగా హిందువులు భావిస్తున్నారు, 11వ శతాబ్ధానికి చెందిన స్మారక చిహ్నాలను ఏఎస్ఐ రక్షిస్తోంది. ఇదిలా ఉంటే ముస్లిం వర్గం దీనిని మసీదుగా పేర్కొంటోంది. ఏప్రిల్ 2003 నుంచి ఏఎస్ఐ ఆదేశాల మేరకు హిందువులు మంగళవారం పూజలు నిర్వహిస్తుంటే, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. కోర్టు విచారణలో 1958 మాన్యుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 16పై దృష్టి సారించింది. ఇది ప్రార్థనా స్థలాల దుర్వినియోగం, అపవిత్రం నుంచి రక్షణ ఇచ్చేందుకు సంబంధించినది. ప్రాథమికతను నిర్ణయించడానికి ప్రార్థనా స్థలం యొక్క స్వభావాన్ని నిర్ణయించడం చాలా అవసరం అని కోర్టు పేర్కొంది.
Madhya Pradesh | ASI (Archaeological Survey of India) survey of Bhojshala in Dhar to begin tomorrow, 22nd March, after the order of High Court, Madhya Pradesh at Indore. pic.twitter.com/T9le6PfZl3
— ANI (@ANI) March 21, 2024
తాజావార్తలు
-
KL Rahul: నా ప్లాన్ రివర్స్ అయింది.. అయినా నాకు సంతోషమే!
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!