BJP: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై ఎక్కడ నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 9 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కేవలం తమిళనాడుకు చెందిన అభ్యర్థులనే బీజేపీ వెల్లడించింది. చెన్నై సౌత్-తమిళిసై, కోయంబత్తూరు-అన్నామలై, కన్యాకుమారి-రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి ఫేజ్లో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారమే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో మూడో జాబితాలో కేవలంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పేర్లు మాత్రమే ఉన్నాయి. తొలి విడతలో 195 మందిని వెల్లడించింది. అందులో ప్రధాని మోడీ పేరు ప్రకటించారు. మూడోసారి వారణాసి నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. అనంతరం సెకండ్ లిస్టులో 72 మంది పేర్లను ప్రకటించింది. ఈ రెండు జాబితాలో తమ పేర్లు లేవని కీలక నేతలు అలకబూనారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సదానందగౌడ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
Also Read
తమిళిసై ఇటీవలే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమె పదవికి రాజీనామా చేయడం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడం జరిగింది. ఇక బుధవారమే ఆమె తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కమలం గూటికి చేరారు. కొన్ని గంటల వ్యవధిలోనే తమిళిసై లోక్సభ అభ్యర్థిగా ప్రకటించేశారు. గతంలో పలుమార్లు ఆమె పరాజయం పాలయ్యారు. మరోసారి బరిలోకి దిగుతున్నారు. మరీ ఈసారి ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ గత కొద్ది రోజులుగా దక్షణాది రాష్ట్రాలపైనే దృష్టి పెట్టారు. సౌతిండియాలో ఎక్కువ సీట్లు గెలిచేందుకు ప్రయత్ని్స్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించనుంది. తొలి విడతగా ఏప్రిల్ 19న పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇక జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!