Terror Funding Case: యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెర్రర్ ఫండింగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్కు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు యాసిన్ మాలిక్ వివిధ దేశాలు, సంస్థల నుంచి నిధులు సేకరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మే 19న ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్ట్ యాసిన్ మాలిక్ ని టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేల్చింది. దీంట్లో భాగంగా బుధవారం న్యాయస్థానం ముందు యాసిన్ మాలిక్ ను అధికారులు హాజరుపరిచారు.
అన్ లా ఫుల్ యాక్టవిటీస్ యాక్ట్ (ఉపా) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద యాసిన్ మాలిక్ పై కేసులు నమోదు అయ్యాయి. యూఏపీఏ లోని సెక్షన్లు 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్య కోసం నిధుల సేకరణ), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర) మరియు 20 (ఉగ్రవాద ముఠా లేదా సంస్థ సభ్యుడు) మరియు సెక్షన్లు 120-బీ (నేరపూరిత కుట్ర), ఐపీసీ-124 ఏ (విద్రోహం) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు కోర్టులో యాసిన్ మాలిక్ కు ఉరి శిక్ష విధించాలని ఎన్ఐఏ బలంగా వాదించింది. అయితే స్పెషల్ జడ్జ్ ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్కు యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. అతడి చివర శ్వాస వరకు జైల్లోనే ఉంచాలని స్పష్టం చేశారు.
Also Read
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
యాసిన్ మాలిక్ కేసులో తీర్పు సందర్భంగా కాశ్మీర్ లోయ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఈ కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నేతలైన ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే, షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్ మరియు నావల్ కిషోర్ కపూర్ పై కోర్ట్ అభియోగాలు మోపింది. ఈ కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీస్ సయూద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ లపై కూడా చార్జీషీట్ దాఖలు చేశారు ఎన్ఐఏ అధికారులు.
తాజావార్తలు
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!