Kolkata rape-murder: మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’.. దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ..
- మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’..
- విమర్శల దాడిని తీవ్రం చేసిన బీజేపీ..
- ఆమె ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడటం లేదన్న కేంద్రమంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata rape-murder: కలకత్తా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. డాక్టర్లతో పాటు సాధారణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. ముఖ్యంగా ఘటన జరిగి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ముందు నుంచి సీఎం మమతా బెనర్జీ సర్కార్, రాష్ట్ర పోలీసులు వైఫల్యం చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు మహిళా మావోలు మృతి
తృణమూల్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ.. మీరు బెంగాల్ని తగలబెడితే అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ తగలబడుతాయి అని బీజేపీని హెచ్చరించింది.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. మమతా బెనర్జీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్తో పోల్చారు. ఆమె ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడలేని అన్నారు. ఇది ముఖ్యమంత్రి వాడే భాష కాదని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తన వ్యతిరేకతను సహించడు, అదే విధంగా మమతా బెనర్జీ తన ప్రతిపక్షాల మాటల్ని సహించదు అని అన్నారు.
న్యాయం చేయాలని కోరడం అశాంతి కలిగించడం లాంటిదని ఆమె మాట్లాడుతోందని, ఇది నిరసనకారుల్ని, వైద్యుల్ని అవమానపరచడమే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. పశ్చిమ బెంగాల్లో నేరస్తులు తప్పా ఎవరూ సురక్షితంగా లేని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!