INDIA Alliance: మోడీపై సమిష్టిపోరుకు సమాయత్తం..నేడు “లోగో” ఆవిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Alliance: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు, ప్రధాని మోడీని గద్దె దించేందుకు ఇండియా కూటమి సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, శివసేన(ఉద్ధవ్), ఆర్జేడీ, జేడీయూ, జేఎంఎం వంటి మొత్తం 28 పార్టీలో ఇండియా కూటమి జట్టు కట్టాయి. ఈ కూటమిని మూడో విడత సమావేశం ముంబైలో జరుగుతోంది. నిన్న, ఈ రోజు సమావేశాల్లో ఏజెండా, జెండా, సీట్ల పంపకాలు తదితర అంశాలపై నేతలు చర్చించారు. అంతకు ముందు పాట్నాలో కూటమి మొదటి సమావేశం జరగగా, బెంగళూర్ లో రెండో సమావేశం జరిగింది.
ముంబైలో రెండో రోజు జరుగుతున్న ఈ మీటింగ్ లో ఇండియా కూటమి ‘లోగో’ ఆవిష్కరించనున్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు ప్రచార వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. సీట్ల సర్దుబాలుపై ఈ నెల 30న నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో ఇండియా కూటమి కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
Read Also: T Congress: హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తేదీ మారే ఛాన్స్
సమన్వయ కమిటీ కోసం కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే భాగస్వామ్య పార్టీల నుంచి ఒకరి పేరు ఇవ్వాల్సిందిగా కోరారు. కూటమి కన్వీనర్, అధికార ప్రతినిధులను ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నాటిక కూటమి మానిఫెస్టో విడుదల చేయాలని మమతా బెనర్జీ కోరారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కామన్ ఎజెండా ఉండాలని ఖర్గే అభిప్రాయపడ్డారు.
శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో పాటు బీజేపేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్, హేమంత్ సొరెన్ వంటి వారితో పాటు సీనియర్ నేత శరద్ పవార్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..