T Congress: హైదరాబాద్లో సీడబ్ల్యూసీ భేటీ.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తేదీ మారే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Congress: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (డబ్ల్యూసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. సెప్టెంబరు 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ శివార్లలో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన ఏర్పాట్లకు కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, సమావేశ తేదీలు మారవచ్చు. ఈసారి ఎలాగైనా తెలంగాణ సాధించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న హస్తం పార్టీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఊపు తెచ్చేందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఇక్కడే నిర్వహించాలని యోచిస్తున్నారు.
Read also: Pragyananda Meet PM: ప్రధానిని కలిసిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి తాజాగా దరఖాస్తులను ఆహ్వానించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా ముగియనుంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీ కాంగ్రెస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నది. సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు. అయితే హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెడితే.. కాంగ్రెస్ నేతలందరి సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయవచ్చని రేవంత్ రెడ్డి ప్లాన్. అందుకే హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేలా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ సమావేశంలోనే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ యోచిస్తోంది.
Read also: Jamili election: జమిలి ఎన్నికలు.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ!
పార్లమెంట్ ప్రత్యేక సమావేశం రూపంలో సీడబ్ల్యూసీ సమావేశాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, అందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తేదీలు మారినప్పటికీ సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలతో ఉంది.
TS RTC: తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. టీ-9 టికెట్ సెప్టెంబర్ 4 వరకు ఇవ్వరు..!
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!