Kejriwal: భారత ఆత్మపై దాడి చేశారు.. గవాయ్పై దాడిని ఖండించిన కేజ్రీవాల్
- భారత ఆత్మపై దాడి చేశారు
- గవాయ్పై దాడిని ఖండించిన కేజ్రీవాల్
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.
ఇక గవాయ్పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు.
Also Read
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
ఇది కూడా చదవండి: Tragedy: హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా..
తాజాగా ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు. సీజేఐ బీఆర్ గవాయ్పై దాడిని ఖండించారు. గవాయ్పై బూటు విసిరే ప్రయత్నం కేవలం ఒక న్యాయమూర్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మపై జరిగిన దాడి.. ఈ దేశ న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘‘ఒక దళిత కుమారుడు కష్టపడి పనిచేసి.. నిజాయితీ ద్వారా దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. దీనిని కొందరు సహించలేకపోతున్నారు. నిందితుడి మద్దతుదారులు సీజేఐను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఈ దేశం ఈ రకమైన రాజకీయాలను ఎప్పటికీ సహించదు.’’ అని ఎక్స్లో కేజ్రీవాల్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
-
Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
-
Mojtaba Khamenei: “సముద్ర గర్భంలో పాతిపెడతాం”.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!