Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
- నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి
- కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇక అంతే వేగంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఈ క్రమంలో వందలాది మంది పాలస్తీనీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాడు మొదలైన యుద్ధం.. నేటికీ కొనసాగుతోంది. ఈరోజుతో (07-10-2025) గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తైంది. గాజా ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. ఎటుచూసినా కూలిన బిల్డింగ్లతో కళావిహీనంగా మారింది.
ఇది కూడా చదవండి: EV Prices: ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి గడ్కరీ గుడ్ న్యూస్..
Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
ప్రస్తుతం ట్రంప్ శాంతి ఒప్పందానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. సోమవారం ఈజిప్టు వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బందీలను మాత్రం హమాస్ విడుదల చేయలేదు.
ఇది కూడా చదవండి: Farmhouse Party: ఇన్స్టాలో పరిచయాలు.. వీకెండ్కు చిల్ అవుదాం అనుకున్నారు.. సీన్ కట్ చేస్తే..
ఇదిలా ఉంటే హమాస్కు గత ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు డెడ్లైన్ విధించారు. ఆలోపు శాంతి ఒప్పందానికి అంగీకారం తెలియజేయకపోతే నరకం చూస్తారని గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ గడువు ముగిసింది. రెండేళ్లు పూర్తయ్యాయి. కానీ బందీలు మాత్రం విడుదల కాలేదు. ట్రంప్ శాంతి చర్చలు ఏ మాత్రం ప్రతి ఫలం ఇస్తాయో ఇంకా తేలడం లేదు.
ఈ మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. కానీ హమాస్ మాత్రం అందుకు ససేమిరా అందింది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి శాంతికి శ్రీకారం చుట్టారు. ఈ చర్చలు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చుతాయో తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సీజేఐపై దాడికి యత్నం.. పవన్ కల్యాణ్ కీలక ట్వీట్..
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!