Tragedy: హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా..
- హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను
- భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లై.. భర్త పిల్లలున్న కొందరు మహిళలు పరాయి వ్యక్తుల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో అప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఓ మహిళ మూడో వివాహానికి రెడీ అయ్యింది. హలో బేబీ నేను నిన్ను మూడో పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడితో ఫోన్ లో మాట్లాడింది. ఆ మాటలు విన్న భర్త కోపంతో రగిలిపోయాడు. గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read:Road Accident: పట్టపగలే పీకలదాకా తాగి.. ఆగి ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టిన యువకుడు!
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
కాన్పూర్ జిల్లాలోని బంబురిహా గ్రామానికి చెందిన బాబురామ్ గౌతమ్, శాంతి భార్యాభర్తలు. భార్య శాంతి గత కొన్ని నెలలుగా మరొక వ్యక్తితో మాట్లాడుతోంది. ఇది తెలిసిన బాబురామ్ భార్యను హెచ్చరించాడు. కానీ శాంతి తన బుద్ది మార్చుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. చివరకు భార్యను హత్య చేసి తాను తనువు చాలించాడు. పిల్లల కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని షాక్ కు గురయ్యారు. వెంటనే వారు పోలీలసులకు సమాచారం అందించారు.
బాబూరామ్ జీవిత కథ సినిమా కథలా ఉంది. అతను మొదట 2009లో షాపూర్కు చెందిన నాంకిని వివాహం చేసుకున్నాడు. వారికి చందన్, లాలి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, వైవాహిక విభేదాలు పెరిగి, తొమ్మిది సంవత్సరాల క్రితం నాంకి అతన్ని విడిచిపెట్టింది. 2018లో, బాబూరామ్ మహారాజ్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సర్సౌల్కు చెందిన శాంతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు అంకుష్, అర్పిత్ అనే ఇద్దరు కుమారులు, నిత్య అనే కుమార్తె ఉన్నారు.
Also Read:Hyderabad Child Torture: నువ్వేం తల్లివి.. ప్రియుడితో కలిసి 4 ఏళ్ల కూతురుకి టార్చర్..
కొంతకాలం తర్వాత వీరి కాపురంలో కలహాలు చెలరేగాయి. దీంతో శాంతి మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది. నీతో ఉండను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని బాబూరామ్ కు చెప్పింది. దీంతో భర్తకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే భార్యను హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- husband
- kanpur
- third marriage
- UP
- wife
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!