Karnataka Elections: “నా కులం చూసే టికెట్ ఇవ్వలేదు”.. బీజేపీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections: కర్ణాటకలో బీజేపీ టికెట్ల వివాదం రచ్చరచ్చ అవుతోంది. మంగళవారం రోజు 189 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అయితే వీటిలో 52 మంది పాతవారిని కాదని కొత్త వారికి చోటు కల్పించింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే మాజీ ఉపముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కి టికెట్ నిరాకరించింది. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించడం హాట్ టాపిక్ గా మారింది.
Read Also: Fire Accident : హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
- Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ఇదిలా ఉంటే తాజాగా ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల పార్టీ వ్యవహరించిన తీరును చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. ఉడిపిలోని తన నివాసంలో విలేకరులతో భట్ మాట్లాడుతూ..‘‘పార్టీ నిర్ణయంపై నేను బాధగా లేను, కానీ పార్టీ నాతో వ్యవహరించిన తీరు నన్ను బాధించింది’’ అని కంటతడి పెట్టారు. పార్టీ నిర్ణయాన్ని తెలియజేయడానికి పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కూడా తనకు ఫోన్ చేయలేదని, టెలివిజన్ ఛానెళ్ల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని ఆయన అన్నారు.
అమిత్ షా జగదీష్ షెట్టర్ కి ఫోన్ చేసి మార్పుల గురించి తెలియజేశారని, అయితే షా నన్ను పిలుస్తారని నేను అనుకోను కానీ కనీసం జిల్లా అధ్యక్షుడైనా ఫోన్ చేసి ఉండాల్సింది అని అన్నారు. నా కులం కారణంగా నాకు టిక్కెట్ నిరాకరిస్తే దానికి నేను అంగీకరించని అన్నారు. పార్టీ ఎదుగుదలకు అవిశ్రాంతంగా పనిచేసిన తనలాంటి వ్యక్తులు బీజేపీకి అవసరం లేదని అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, తనకు అవకాశాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ నిలబెట్టిన యశ్ పాల్ సువర్ణకు మద్దతిస్తానని అన్నారు. తదుపరి చర్యల కోసం తక్షణ నిర్ణయం ఇప్పుడేం చెప్పలేనని అన్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!