Indus Water Treaty: పాక్కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..
- పాకిస్తాన్కి షాక్ ఇవ్వబోతున్న భారత్..
- సింధు నదులపై ప్రాజెక్టులకు శ్రీకారం..
- రణబీర్ కాలువ పొడవు పెంచే దిశగా ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్పడినట్లు తేలింది. పాకిస్తాన్ దేశంలో 80 శాతం మంది ప్రజలకు ఈ సింధు నది, దాని ఉపనదుల జలాలే జీవనాధారం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేయవద్దని పాకిస్తాన్ భారత్ని కోరుతోంది. ఇదిలా ఉంటే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిచే ఉంటుందని స్పష్టం చేసింది.
తాజాగా, సింధు నది జలాల విషయంలో భారత్ దాయాదికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, సింధు జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ పంటలకు నీటిని అందించే ప్రధాన నది నుంచి నీటిని మళ్లించే ప్రణాళికల్ని భారత్ పరిశీలిస్తోంది. భారత్ గుండా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుకు వెళ్లే చీనాబ్ పై ఉన్న రణబీర్ కాలువ పొడవును 120 కి.మీకి రెట్టింపు చేయాలని చూస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే అంటే, 1960కి ముందే ఈ కాలువ నిర్మించబడింది.
Also Read
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
భారత్ చీనాబ్ నది నుంచి పరిమిత మొత్తంలో నీటిని తీసుకోవడానికి అనుమతి ఉంది. కాలువ విస్తరణకు సంవత్సరాలు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సెకన్కి 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఇది 40 క్యూబిక్ మీటర్లుగా ఉంది. రణబీర్ కాలువ విస్తరించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు ప్రస్తుతానికి నివేదించబడలేదు. కాలువను విస్తరించడంతో పాటు, ఆ దేశానికి కేటాయించిన సింధు, చీనాబ్, జీలం నుంచి నీటిని మెరుగ్గా వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నీటిని ఉతగ్తర భారత రాష్ట్రాలతకు తరలించే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. కొత్తగా ఈ ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టుల్ని భారత్ గుర్తించిందని, వాటిలో నాలుగు చీనాబ్, జీలం నదులపై ఉన్నట్లు తెలిపింది.
ఇటీవల, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ, ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’’ అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం ఒప్పందాన్ని భారత్ నిలిపి ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని నిలిపేయడం చట్టవిరుద్ధమని వాదిస్తూ, భారత్కి లేఖ రాశారు.
అయితే, ప్రస్తుతం సింధు నది వ్యవస్థ నుంచి భారత్ గణనీయమైన మొత్తంలో నీటిని నిలిపేయడం లేదా మళ్లించడం కోసం ఆనకట్టలు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి భారతదేశానికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాకిస్తాన్కి వెళ్లే కొద్ది మొత్తాన్ని అడ్డుకున్నా కూడా ఆ దేశంలోని వ్యవసాయం అస్తవ్యస్తం అవుతుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..