Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Indus Water Treaty India To Shock Pakistan Canals And Projects On Indus Rivers To Be Launched

Indus Water Treaty: పాక్‌కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..

Published Date :May 16, 2025 , 5:49 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌కి షాక్ ఇవ్వబోతున్న భారత్..
  • సింధు నదులపై ప్రాజెక్టులకు శ్రీకారం..
  • రణబీర్ కాలువ పొడవు పెంచే దిశగా ఆలోచన..
Indus Water Treaty: పాక్‌కి షాక్ ఇవ్వనున్న భారత్.. సింధు నదులపై కాలువలు, ప్రాజెక్టులకు శ్రీకారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indus Water Treaty: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర ఘటనకు పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాల్పడినట్లు తేలింది. పాకిస్తాన్ దేశంలో 80 శాతం మంది ప్రజలకు ఈ సింధు నది, దాని ఉపనదుల జలాలే జీవనాధారం. ప్రస్తుతం, ఈ ఒప్పందాన్ని నిలిపేయవద్దని పాకిస్తాన్ భారత్‌ని కోరుతోంది. ఇదిలా ఉంటే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిచే ఉంటుందని స్పష్టం చేసింది.

తాజాగా, సింధు నది జలాల విషయంలో భారత్ దాయాదికి మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, సింధు జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ పంటలకు నీటిని అందించే ప్రధాన నది నుంచి నీటిని మళ్లించే ప్రణాళికల్ని భారత్ పరిశీలిస్తోంది. భారత్ గుండా పాకిస్తాన్‌‌లోని పంజాబ్ ప్రావిన్సుకు వెళ్లే చీనాబ్ పై ఉన్న రణబీర్ కాలువ పొడవును 120 కి.మీకి రెట్టింపు చేయాలని చూస్తోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే అంటే, 1960కి ముందే ఈ కాలువ నిర్మించబడింది.

Read Also: CM Chandrababu: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డే.. లక్షల మందితో ప్రధాని యోగాసనాలు.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష..

భారత్ చీనాబ్ నది నుంచి పరిమిత మొత్తంలో నీటిని తీసుకోవడానికి అనుమతి ఉంది. కాలువ విస్తరణకు సంవత్సరాలు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సెకన్‌కి 150 క్యూబిక్ మీటర్ల నీటిని మళ్లించడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఇది 40 క్యూబిక్ మీటర్లుగా ఉంది. రణబీర్ కాలువ విస్తరించడంపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు ప్రస్తుతానికి నివేదించబడలేదు. కాలువను విస్తరించడంతో పాటు, ఆ దేశానికి కేటాయించిన సింధు, చీనాబ్, జీలం నుంచి నీటిని మెరుగ్గా వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఈ నీటిని ఉతగ్తర భారత రాష్ట్రాలతకు తరలించే అవకాశాన్ని భారత్ పరిశీలిస్తోందని రాయిటర్స్ వార్తా సంస్థ చెబుతోంది. కొత్తగా ఈ ఐదు రిజర్వాయర్ ప్రాజెక్టుల్ని భారత్ గుర్తించిందని, వాటిలో నాలుగు చీనాబ్, జీలం నదులపై ఉన్నట్లు తెలిపింది.

ఇటీవల, ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, సింధు జలాల ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ, ‘‘నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’’ అని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం ఒప్పందాన్ని భారత్ నిలిపి ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని నిలిపేయడం చట్టవిరుద్ధమని వాదిస్తూ, భారత్‌కి లేఖ రాశారు.

అయితే, ప్రస్తుతం సింధు నది వ్యవస్థ నుంచి భారత్ గణనీయమైన మొత్తంలో నీటిని నిలిపేయడం లేదా మళ్లించడం కోసం ఆనకట్టలు, కాలువలు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడానికి భారతదేశానికి సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పాకిస్తాన్‌కి వెళ్లే కొద్ది మొత్తాన్ని అడ్డుకున్నా కూడా ఆ దేశంలోని వ్యవసాయం అస్తవ్యస్తం అవుతుందని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Pakistan
  • India-Pakistan War
  • Indus rivers
  • Indus Water Treaty
  • Operation Sindoor

తాజావార్తలు

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

  • RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions