CM Chandrababu: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా డే.. లక్షల మందితో ప్రధాని యోగాసనాలు.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష..
- అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే..
- మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాల నిర్వహణ..
- నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్..
- విశాఖలో లక్షల మందితో ప్రధాని మోడీ యోగాసనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: “‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ ను ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్గా తీసుకున్నామన్నారు సీఎం చంద్రబాబు.. ‘జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని.. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలన్నారు.. ‘యోగాంధ్ర-2025’ థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలిలని.. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు సీఎం చంద్రబాబు… ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని. . దీని కోసం ప్రైవేటు వ్యక్తులు, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు.
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
నెలరోజుల పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలన్నారు సీఎం.. నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లలు తీసుకోవాలని.. అదే విధంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలన్నారు.. యోగా అనేది ప్రాథమిక బాధ్యత అనేలా ప్రతిఒక్కరూ భావించాలని.. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలన్నారు.. రాష్ట్రంలో ప్రతి చోటా యోగాపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలి. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు.. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలి” అని సిఎం చంద్రబాబు సూచించారు..
Read Also: Rajkumar Mishra: లండన్లో మేయర్గా ఎన్నికైన భారతీయుడు..
ఆర్కె బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యోగా నిర్వహించేందుకు 68 ప్రాంతాలు గుర్తించారు. ఆర్కే బీచ్, రుషికొండ, స్కూల్, క్రికెట్, పోలీస్, స్పోర్ట్చ్, నావీ ప్రాంగణాలతో పాటు పలు ఖాళీ ప్రదేశాలను యోగా నిర్వహణకు గుర్తించారు. ఈ 68 లోకేషన్ల ద్వారా 2,58,948 మంది యోగా సాధనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రకటించి 10 ఏళ్లు పూర్తియిన సందర్భంగా, ప్రధాని పాల్గొనే విశాఖ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా 5 లక్షల మంది భాగస్వాములు అయ్యేలా ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం వరకు బీచ్ పొడవునా అన్ని అనుకూల ప్రాంతాల్లో ప్రజలను ఆహ్వానించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యోగా డే రోజుల ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా సాధన ఉంటుంది. 2015లో తొలిసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు 36 వేల మందితో ఒకే వేదికపై నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. తొలి ఏడాది 84 దేశాల్లో యోగాను నిర్వహించారు. ప్రపంచంలోని 170కి పైగా దేశాలు యోగా డే ను ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. 2023లో సూరత్లో 1,53,000 మందితో ఒకే చోట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరిపి మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లకు ఎక్కింది. సూరత్ తరహా మోడల్లో విశాఖలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహించి.. ఈసారి ఆ రికార్డును తిరగరాయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, కేంద్ర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!