India’s first bullet train: 2026లో ఇండియాలో తొలి బుల్లెట్ ట్రైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్ను విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగిందని, నిర్ణీత కాలక్రమం ప్రకారం ప్రాజెక్ట్ కొనసాగుతోందని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: Housing Crisis: భారత విద్యార్థులకు కెనడా షాక్..? హౌసింగ్ సంక్షోభం నేపథ్యంలో పరిమితి..
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
2026లో దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని.. సూరత్, బిలిమోరాల మద్య రైల్ని నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. వైర్ డక్ట్ పనులతో పాటు ముంబై-థానే అండర్ సీ టన్నెల్ పనులు కూడా ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ మార్గంలో ఉన్న 8 నదులపై వంతెనల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటికే రెండు వంతెనలు పూర్తయ్యాయని, సబర్మతిట టెర్మినట్ స్టేషన్ కూడా పూర్తైనంట్లు ఆయన తెలిపారు.
అంతకుముందు జనవరి 8న ముంబై-అహ్మదాబాద్ రైల్ కారిడార్ కోసం 100 శాతం భూసేకరణ విజయవంతమైందని రైల్వే మంత్రి ప్రకటించారు. బుల్లెట్ రైలు కారిడార్కు రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఆర్థిక నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం రూ. 10,000 కోట్లు, గుజరాత్ మరియు మహారాష్ట్రలు ఒక్కొక్కటి రూ. 5,000 కోట్లు అందించాయి, మిగిలిన నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుండి 0.1 శాతం వడ్డీ రుణం పొందుతున్నారు. సెప్టెంబర్ 2017లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జపాన్ షెంకన్సెన్ రైల్ సాంకేతికత ఆధారంగా ఈ భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రూపొందుతోంది.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..