Population: 2023 నాటికి భారత్దే అగ్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సంవత్సరాల నుంచి భారత్ జనాభా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా నిలవనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఐరాస సోమవారం 2022 ప్రపంచ జనాభా అంచనాల నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్కల్లా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్ను తాకే అవకాశం ఉందని, ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న భారత్ 2023 నాటికి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనుందని ఆ నివేదిక వెల్లడించింది.
ఐరాస గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, భారత్ జనాభా 141.2 కోట్లుగా ఉంది. వచ్చే ఏడాది నాటికి చైనా ఫిగర్ను దాటనుందని పేర్కొంటున్న ఐరాస.. 2050 నాటికి భారతదేశ జనాభా సంఖ్య 166.8 కోట్లకు చేరనుందని అంచనా వేసింది. చైనా జనాభా మాత్రం 131.7 కోట్లకు తగ్గొచ్చని తెలిపింది. నిజానికి.. 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని చైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినా, అక్కడ జననాల రేటు పడిపోతూ వస్తోంది. బహుశా 2016 వరకు ఉన్న ఒకే బిడ్డ విధానానికి అక్కడి జనాలు ఇంకా కట్టుబడి ఉన్నట్టున్నారు. కానీ, భారత్లో జననాల రేటు మాత్రం గణనీయంగా పెరుగుతూనే ఉంది. అందుకే, జనాభా అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతోందని గణాంకాలు తెలుపుతున్నాయి.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
ఇక ప్రపంచ జనాభా విషయానికొస్తే.. 2030 నాటికి 850 కోట్లు కాగా, 2050కి 970 కోట్లకు చేరే అవకాశముందని ఐరాస తెలిపింది. ‘‘ఈ ఏడాది ప్రపంచ జనాభాలో సరికొత్త మైలురాయిని మనం చేరుకోనున్నాం. 800 కోట్ల మార్క్ని చేరుకోనున్నాం. ఆరోగ్య ప్రమాణాల్లో మరింత పురోగతి సాధిస్తున్న తరుణంలో.. ఆయుర్దాయం పెరుగుతోంది. మాతా, శివ మరణాల రేట్లు తగ్గుతున్నాయి’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెసర్ అన్నారు. ఇదే సమయంలో ఈ భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని సూచించారు.
తాజావార్తలు
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!