డ్రోన్ల కొనుగోలు పై నిర్ణయం తీసుకోనున్న రక్షణ మంత్రిత్వ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే, అది రక్షణ మం త్రి నేతృత్వంలోని డిఫెన్స్ అక్వీజీషన్ కౌన్సిల్కు పంపబడుతుంది. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు తుది ఆమోదం తెలి పేందుకు క్యాబినెట్ కమిటీకి పంపబడుతుంది. ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. డ్రోన్లు అధునాతన వ్యవస్థలు, ఆయుధాల ప్యాకే జీలతో వస్తాయన్నారు.దీర్ఘ-శ్రేణి నిఘా, ఖచ్చితమైన దాడులను చేయగట సామర్థ్యం వీటికి ఉందని తెలిపారు.
భారతదేశం డ్రోన్ జాబితాలో MQ-9B సీగార్డియన్/స్కైగార్డియన్ వేరియంట్లు ఉన్నాయి. ఒక వేళ ఈ డీల్ కుదురితే భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక్కొక్కటి కస్టమైజ్డ్ స్పెసీఫికేషన్లతో 10 డ్రోన్లను పొందవచ్చని వారు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం గత ఏడాది అమెరికా నుంచి లీజుకు తీసుకున్న రెండు నిరాయుధ సీగార్డియన్ డ్రోన్లను భారత నావికాదళం ఇప్పటికే ఉపయోగిస్తోంది.
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఆయుధ వ్యవస్థలను లీజుకు తీసుకునే ఎంపిక డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ 2009 రక్షణ శాఖకు కల్పించింది. లీజుకు తీసుకోవడమా కొనుగోలు చేయడమా అనే దానిపై సందిగ్ధతపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్నేళ్లుగా భారత సాయుధ దళాలు నిఘా అవసరాల కోసం అమె రికా వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. భారత నావికాదళం ఇప్ప టికే తొమ్మిది P-8I దీర్ఘ-శ్రేణి నిఘా విమానాలను ఉపయోగిస్తోంది. ఈ డీల్ కుదిరితే రాబోయే మరికొన్ని ఏళ్లలో డ్రోన్లతో పాటు మరో 9 విమానా లను పొందవచ్చని రక్షణ శాఖ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!