Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిన్(ఎస్జేఎఫ్) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారతదేశాన్ని, ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ పై హమాస్ తీవ్రవాదుల దాడిని పోలుస్తూ, ప్రధాని మోడీ ఈ దాడి నుంచి నేర్చుకోవాలని బెదిరించాడు. ఇలాంటి దాడి రాకుండా చూసుకోవాలంటూ బీరాలు పలికాడు.