Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న పైలట్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhoi Crash: గురువారం అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భారత వైమానిక దళం సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరణించిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఉన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’లో దురాగ్కర్ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో భారత వైమానికదళం అత్యుత్తమ పైలట్ను కోల్పోయింది.
28 ఏళ్ల దురాగ్కర్ 10 రోజుల క్రితమే కుటుంబ సభ్యుల్ని కలిశారు. తన కొడుకు ఆపరేషన్ సిందూర్లో భాగమని మొదట తెలియదని, ఈ ఆపరేషన్ జరిగిన 15 రోజుల తర్వాత తెలిసిందని ఆయన తండ్రి రవీంద్ర దురాగ్కర్ అన్నారు. తన కొడుకు వైమానిక దళంలో భాగమైనందుకు గర్వంగా ఉందని, యుద్ధవిమానాల గురించి తనకు చెప్పేవాడని కన్నీంటిపర్యంతమయ్యారు. తన కొడుకు తన కలను సాధించారని, కానీ కోరుకున్నంత కాలం దేశానికి సేవ చేయలేకపోయారని అన్నారు.
Also Read
Read Also: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్,స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ Su-30 MKIలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా, అది జోర్హాట్ వైమానిక స్థావరం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. టేకాఫ్ ప్రాంతం నుంచి 60 కి.మీ దూరంలో విమానం కుప్పకూలింది.
పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని అనేక ఉగ్రవాద శిబిరాలపై భద్రతా దళాలు దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. దీని తర్వాత పాక్ సైన్యం జరిపిన దాడుల్ని కూడా భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..