Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: భారతీయ రైల్వేకి చెందిన ఫస్ట్ ఏసీ కోచ్ను రోమాంటిక్ ‘హనీమూన్ సూట్’గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. ఈ అంశంపై పెద్ద వివాదం, చర్చకు దారితీసింది. వాస్తవానికి.. నాందేడ్గ్రామ్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 110002) రైలులో ఓ కంపార్ట్మెంట్ను బెలూన్లు, రంగు రంగుల పూలు, వేలాది గులాబీ రేకులతో పాటు “ఐ లవ్ యూ” అనే మెసేజ్తో అత్యంత విలాసవంతంగా అలంకరించారు. ఈ రోమాంటిక్ సెటప్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది. మహారాష్ట్రకు చెందిన ‘రాహత్ రూమ్ డెకరేషన్’ అనే ప్రైవేట్ సంస్థ ఈ అలంకరణ చేసినట్లు అంగీకరించింది. జల్నాకు చెందిన ఓ కొత్త జంట కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఆ జంట ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్కు చేరుకునే లోపే ఈ డెకరేషన్ చేశారు. ఆ తర్వాత జల్నా స్టేషన్లో ఆ దంపతులు రైలు ఎక్కారు.
అయితే, ఈ అందమైన సర్ప్రైజ్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. డెకరేషన్ నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రైలు కోచ్లోకి ప్రవేశించారని, ఇది రైల్వే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ భద్రతా లోపానికి బాధ్యుడిగా చేస్తూ, ఆ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ గిరీష్ కుమార్ను రైల్వే శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అంతర్గత శాఖాపరమైన విచారణకు సైతం ఆదేశించింది. ఈ వీడియో ఇంటర్నెట్లో విపరీతమైన మీమ్స్, జోకులకు కేరాఫ్ అడ్రస్గా మారింది. నెటిజన్లు ఈ కోచ్కు సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్ అని, హనీమూన్ ఆన్ వీల్స్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. కదిలే రైలులో ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు ప్రాక్టికల్ అంటూ నవ్వుకుంటున్నారు. ఒకవైపు కొందరు తమ ప్రత్యేక క్షణాలను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రైల్వే నిబంధనలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తి అయిన రైలు కోచ్లను ఇలా ప్రైవేట్ వ్యక్తులు తమ ఇష్టమొచ్చినట్లు అలంకరించడానికి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా బెలూన్లు, కాగితాలు, పూలు వంటి వస్తువుల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని, ఇది తోటి ప్రయాణికుల భద్రతకు, రైలు పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తుందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
A First AC coach has reportedly been decorated with a "honeymoon-style" setup.
The Railway administration must explain: is it's allowed? @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @PMOIndia pic.twitter.com/ofE4AGawJH
— The Nalanda Index (@Nalanda_index) July 7, 2026
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!