Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్ఫోన్ వాడకం తెలియక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ సరికొత్త సేవలను రైతులకు ఉమ్మడిగా అందిస్తోంది.
ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్బుక్ (PPB) నంబర్తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీసేవ ఆపరేటర్ రైతు సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆన్లైన్ సిస్టమ్లో నమోదు చేస్తారు. అనంతరం రైతు తనకు అనుకూలమైన ఎరువుల డీలర్ను ఎంచుకుని, అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో పాస్బుక్తో అనుసంధానమైన రైతు మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP)ని ధృవీకరించిన వెంటనే ఒక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. కేవలం పది రూపాయల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
Also Read
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
- Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
- Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీసేవ ద్వారా పొందిన ఈ బుకింగ్ ఐడీ బుక్ చేసిన తేదీ కాకుండా కేవలం 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రైతులు ఆ గడువు ముగిసేలోపే తాము ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్ను కలిసి సబ్సిడీ యూరియాను కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి రైతులు తమ పాస్బుక్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. రైతులందరూ అధికారిక యాప్ లేదా మీసేవ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని.. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)ని సంప్రదించాలని మీసేవ కమిషనర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Captain India: కార్తీక్ ఆర్యన్ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. 9 ఏళ్ల తర్వాత బాలీవుడ్లోకి రీఎంట్రీ!
-
Explainer: గల్ఫ్లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
ట్రెండింగ్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!