Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్ఫోన్ వాడకం తెలియక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ సరికొత్త సేవలను రైతులకు ఉమ్మడిగా అందిస్తోంది.
ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్బుక్ (PPB) నంబర్తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీసేవ ఆపరేటర్ రైతు సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆన్లైన్ సిస్టమ్లో నమోదు చేస్తారు. అనంతరం రైతు తనకు అనుకూలమైన ఎరువుల డీలర్ను ఎంచుకుని, అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో పాస్బుక్తో అనుసంధానమైన రైతు మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP)ని ధృవీకరించిన వెంటనే ఒక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. కేవలం పది రూపాయల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. మొదటి టాస్క్లో దుమ్మురేపిన ఝాన్సీ..
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
- Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీసేవ ద్వారా పొందిన ఈ బుకింగ్ ఐడీ బుక్ చేసిన తేదీ కాకుండా కేవలం 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రైతులు ఆ గడువు ముగిసేలోపే తాము ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్ను కలిసి సబ్సిడీ యూరియాను కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి రైతులు తమ పాస్బుక్కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. రైతులందరూ అధికారిక యాప్ లేదా మీసేవ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని.. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)ని సంప్రదించాలని మీసేవ కమిషనర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu Live: బిగ్బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. మొదటి టాస్క్లో దుమ్మురేపిన ఝాన్సీ..
-
NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్కు చుక్కలు చూపిస్తాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!