Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మైదానంలో ఉన్నా, స్టాండ్స్లో కూర్చున్నా అభిమానులు పండగ చేసుకుంటారు. తాజాగా ధోని తన 45వ పుట్టినరోజును నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో చాలా ప్రత్యేకంగా జరుపుకున్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ను వీక్షించేందుకు ఆయన స్టేడియానికి విచ్చేశారు.
ధోని స్టేడియంలో ప్రత్యక్షం కాగానే అభిమానుల కేరింతలతో నాటింగ్హామ్ హోరెత్తిపోయింది. పెద్ద స్క్రీన్పై ఆయనను చూపించినప్పుడు స్టేడియం మొత్తం ‘ధోని.. ధోని..’ అంటూ నినదించింది. ఈ క్రమంలో ధోని చేసిన ఒక సరదా సైగ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఆయనను మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరగా.. తను ఇప్పుడు ముసలివాడిని అయిపోయానని, ఒకవేళ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వస్తే వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడం తన వల్ల కాదంటూ ధోని నవ్వుతూ చేతులతో సైగలు చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Also Read
MS Dhoni at Trent Bridge to watch the India vs England match.❤️
Had some fun interactions with fans.😄👌 pic.twitter.com/X7ddClMBY2
— Rohit Nation (@Rohitnation45) July 7, 2026
భారత్కు చారిత్రాత్మక ఘోర పరాజయం..
ధోని ఉత్సాహపరిచినప్పటికీ, మైదానంలో భారత జట్టు మాత్రం అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. మూడో టీ20లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక ఓటమిని చవిచూసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద ఓటమి కావడం గమనార్హం.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70 రన్స్) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్ (3/29), జోష్ టంగ్ (4/28) ధాటికి తట్టుకోలేక కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే కుప్పకూలింది.
ఐపీఎల్ స్టార్లుగా పేరొందిన భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో కేవలం 5 ఓవర్లలోనే 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వైభవ్ సూర్యవంశీ (13), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ ఆటగాళ్లంతా బాధ్యతారహితమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, తర్వాతి రెండు మ్యాచ్లు గెలిచిన ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!