Atiq Ahmed: అతిక్ అహ్మద్ హత్యపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు..
Judicial Commission To Probe Atiq Ahmed Killing: దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య. శనివారం రాత్రి పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలకు వెళ్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అత్యంత సమీపంలో నుంచి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
Read Also: Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
Also Read
- Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ 'ప్లాన్-బి' రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
- Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
- Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
- Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
ఇదిలా ఉంటే ఈ హత్యలపై యూపీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. పోలీసులు రక్షణగా ఉన్న ప్రాణాలకు భద్రత లేని రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ మారిందంటూ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యలపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వం వహిస్తారని, రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీ, మాజీ డిజిపి సుబేష్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం తెలిపింది.
కమిషన్ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, రాష్ట్ర హోం శాఖ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952 ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసిందని వారు తెలిపారు. 2005 రాజుపాల్ హత్య, 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన విచారణను అతీక్ అహ్మద్ ఎదుర్కొంటున్నాడు. రెండు రోజుల క్రితం ఉమేష్ పాల్ హత్యలో కీలక నిందితుడు అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అతీక్ అహ్మద్ ను కూడా హత్య చేయబడ్డాడు.
తాజావార్తలు
-
Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్మీ స్మార్ట్ఫోన్ ను రూ. 15,000 తక్కువకే కొనండి!
-
AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!