Delhi: ఢిల్లీలో దారుణం.. సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
- ఢిల్లీలో దారుణం
- సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య
- కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
ఓ విద్యా కుసుమం అర్ధాంతరంగా నేలరాలిపోయింది. ఉన్నతమైన కొలువును సంపాదించేందుకు మహోన్నతమైన ఆశయంతో మహా నగరానికి పోతే.. చివరికి మధ్యలోనే జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన.. ఆ చట్టం రద్దు..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఇటీవల ఢిల్లీలో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు సివిల్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కానీ దీని కంటే ముందుగా ఓ సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుట్టూ కమ్ముకున్న ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన ఒత్తిడి ఆమెను చావు వైపు నడిపించాయి. ఒత్తిడిలో ఆమె తీసుకున్న నిర్ణయంతో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి.. కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Raj Tarun – Lavanya: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. డ్రగ్స్ అలవాటు చేసిందని లావణ్యపై ఫిర్యాదు?
ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అంజలి అనే యువతి మహారాష్ట్ర నుంచి 2022లో ఢిల్లీకి వచ్చింది. మూడు సార్లు పరీక్ష రాసినా విజయం సాధించలేకపోయింది. దీంతో మానసిక ఒత్తిడికి గురైంది. అంతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సూసైడ్ లేఖలో తన మరణానికి గల కారణాలు వెల్లడించింది. అమ్మ, నాన్న క్షమించండి. తాను చాలా విసిగిపోయాను. ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ తన వల్ల కావడం లేదని నోట్లో పేర్కొంది.
ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడి భరించలేకే అంజలి ఆత్మహత్యకు చేసుకుందని ఆమె స్నేహితురాలు మీడియాకు తెలిపింది. హాస్టల్ ఫీజు కూడా బాగా పెరగడంతో.. అద్దె చెల్లించలేక ప్రాణాలు తీసుకుందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోచింగ్ సెంటర్ ఘటనపై విద్యార్థుల ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!