Delhi Elections: మధ్యతరగతి కోసం ఆప్ మరో మేనిఫెస్టో.. బెనిఫిట్స్ ఇవే!
- మధ్యతరగతి కోసం ఆప్ మరో మేనిఫెస్టో
- మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారన్న కేజ్రీవాల్
ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా ఆప్-బీజేపీ పోటాపోటీగా వాగ్దానాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. బీజేపీ ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనేక వాగ్దానాలు ప్రకటించింది. అయితే బీజేపీ కూడా మరో మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతలో తామేమీ తక్కువ కాదంటూ ఆప్ కూడా మధ్యతరగతి ప్రజల కోసం మరో మేనిఫెస్టో ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు.
ఇది కూడా చదవండి: Maoist Leader Chalapati: “భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే.. మనం మెచ్చుకుంటాం. అదే మన దేశంలో చేస్తే.. ఉచితాలని ముద్ర వేస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వారి ప్రయోజనాలకు వినియోగిస్తే.. దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు.
మధ్యతరగతి మేనిఫెస్టో ఇదే!
1. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ, విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడం
2. ఉన్నత విద్యకు రాయితీలు
3. ఆరోగ్య బడ్జెట్ను 10 శాతానికి పెంచడం. ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం
4. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
5. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు
6. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు
7. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించడం
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్ని్కల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా తన ప్రయత్నం చేస్తోంది. ఆప్, బీజేపీ మాత్రం హామీల మీద హామీలు ప్రకటించేస్తున్నాయి. హస్తిన వాసులు ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?