Delhi Elections: మధ్యతరగతి కోసం ఆప్ మరో మేనిఫెస్టో.. బెనిఫిట్స్ ఇవే!
- మధ్యతరగతి కోసం ఆప్ మరో మేనిఫెస్టో
- మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారన్న కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో అధికారమే లక్ష్యంగా ఆప్-బీజేపీ పోటాపోటీగా వాగ్దానాలు ఇస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. బీజేపీ ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు విడుదల చేయగా.. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనేక వాగ్దానాలు ప్రకటించింది. అయితే బీజేపీ కూడా మరో మేనిఫెస్టో విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతలో తామేమీ తక్కువ కాదంటూ ఆప్ కూడా మధ్యతరగతి ప్రజల కోసం మరో మేనిఫెస్టో ప్రకటించింది. మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కోసం పార్లమెంటులో ఆప్ పార్టీ ఎంపీలు లేవనెత్తే ఏడు బడ్జెట్ డిమాండ్లను చేర్చారు.
ఇది కూడా చదవండి: Maoist Leader Chalapati: “భార్యతో సెల్ఫీ”.. మూల్యం చెల్లించుకున్న మావోయిస్ట్ నేత చలపతి..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు పన్నుల భారంతో నలిగిపోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని వృద్ధులకు మెరుగైన వైద్యం, సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంగానే తాము సంజీవని పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును తిరిగి వారి సంక్షేమానికి వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విదేశాల్లో ఇలాంటి పథకాలు అమలు చేస్తే.. మనం మెచ్చుకుంటాం. అదే మన దేశంలో చేస్తే.. ఉచితాలని ముద్ర వేస్తున్నారన్నారు. ప్రజల సొమ్మును వారి ప్రయోజనాలకు వినియోగిస్తే.. దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు.
మధ్యతరగతి మేనిఫెస్టో ఇదే!
1. ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ, విద్యకు ప్రవేశపెట్టే బడ్జెట్ను 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడం
2. ఉన్నత విద్యకు రాయితీలు
3. ఆరోగ్య బడ్జెట్ను 10 శాతానికి పెంచడం. ఆరోగ్య బీమాపై పన్ను ఎత్తివేయడం
4. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
5. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తొలగింపు
6. సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మెరుగైన పింఛను పథకాలు
7. రైల్వేలో సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ కల్పించడం
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్ని్కల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా తన ప్రయత్నం చేస్తోంది. ఆప్, బీజేపీ మాత్రం హామీల మీద హామీలు ప్రకటించేస్తున్నాయి. హస్తిన వాసులు ఈసారి ఎవరికి అధికారం కట్టబెడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Danam Nagender: చింతల్బస్తీలో ఎమ్మెల్యే దానం హల్చల్.. కూల్చివేత అడ్డగింత
తాజావార్తలు
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!