Shashi Tharoor: శశిథరూర్ విషయంలో దిద్దుబాటు చర్యలు.. కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే!
- కేరళ ఎన్నికల వేళ మారుతున్న పరిణామాలు
- శశిథరూర్ విషయంలో దిద్దుబాటు చర్యలు
- కాంగ్రెస్ తాజా ప్లాన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శశిథరూర్.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుతం తిరువనంతపురం లోక్సభ ఎంపీగా ఉన్నారు. అయితే చాలా కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో ఎక్కువగా చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు. ప్రధాని మోడీని పదే పదే మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శశిథరూర్ను పట్టించుకోవడం మానేసింది. ఇటీవల కేరళలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా శశిథరూర్ దూరయ్యారు. దీంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. అంతేకాకుండా విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
అయితే త్వరలోనే కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విభేదాలు కొనసాగితే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని సీనియర్లు భావిస్తు్న్నారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. శశిథరూర్తో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది.
ఇది కూడా చదవండి: Chinmayi : అవకాశాల కోసం శరీరం అడిగేవాళ్లు – చిరు మాటలపై చిన్మయి షాకింగ్ కౌంటర్
శశిథరూర్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్లు ఆహ్వానించవచ్చని వర్గాలు పేర్కొన్నాయి. ‘‘నేను చెప్పగలిగేది ఏమిటంటే.. నా సొంత పార్టీ నాయకత్వంతో నేను చర్చించాల్సిన సమస్యలు ఉన్నాయి. బహిరంగ వేదికపై కాదు… నేను పార్లమెంటు కోసం ఢిల్లీకి వెళ్తాను. నా ఆందోళనలను పార్టీ నాయకత్వానికి స్పష్టంగా తెలియజేయడానికి. వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి. సరైన సంభాషణ జరపడానికి నాకు అవకాశం లభిస్తుందని నేను నమ్ముతున్నాను.’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. ‘‘నేను గత 17 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నాను. మనం ఎక్కువ దూరం వెళ్లకూడదు… నా విషయానికొస్తే.. ఏది తప్పు జరిగిందో.. దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. తగిన వేదికలో పరిష్కరించబడుతుంది.’’ అని శశిథరూర్ పీటీఐతో వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!