Rahul Gandhi: ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
- ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ
- ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
- రాహుల్ గాంధీ ఈశాన్య పట్కా ధరించలేదని బీజేపీ ఎదురుదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రొటోకాల్ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రగడగా మారింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గ్రాండ్గా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వేడుకల్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు మూడో వరుసలో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని ఆరోపించింది. ఈ సందర్భంగా 2014లో ఎల్కే అద్వానీ ప్రతిపక్ష నేత కాకపోయినా ముందు వరుసలో సీటు ఏర్పాటు చేసినట్లుగా అప్పటి ఫొటోను కాంగ్రెస్ విడుదల చేసింది.

Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
ఇక సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యూరోపియన్ అతిథులతో పాటు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేంద్రమంత్రులు, వీఐపీలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం నుంచి కూడా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇక దీనికి కౌంటర్గా బీజేపీ విమర్శలకు దిగింది. ప్రతిపక్ష నాయకులను అవమానించలేదని బీజేపీ పేర్కొంది. రాహుల్గాంధీనే ఈశాన్య ప్రాంత పట్కా ధరించలేదని ఆరోపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరినప్పటికీ పట్కా ధరించలేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలపై అసహనం కారణంగానే రాహుల్ గాంధీ ఇలా చేశారని ఆరోపించింది. మోడీ, ఖర్గే సహా అందరూ పట్కా ధరించారని.. రాహుల్ గాంధీనే ధరించిలేదని పేర్కొంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ కౌంటర్..
ఇక బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ సంగతి పక్కన పెట్టండి.. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ గొడవేంటి? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రమంత్రి ఎందుకు పట్కా ధరించలేదని నిలదీసింది. ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పట్కా ఎందుకు ధరించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తోందని.. ఇది బీజేపీ మనస్తత్వం అని ధ్వజమెత్తింది.

#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi and Congress National President and Rajya Sabha LoP Mallikarjun Kharge seen at the Rashtrapati Bhavan at yesterday's 'At Home' ceremony on the occassion of the 77th Republic Day. pic.twitter.com/f7EgCGslfR
— ANI (@ANI) January 27, 2026
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్కు షాక్.. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!