Rahul Gandhi: ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ.. ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
- ప్రొటోకాల్పై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రగడ
- ‘ఎట్ హోమ్’ నుంచి వెళ్లిపోయిన రాహుల్గాంధీ, ఖర్గే
- రాహుల్ గాంధీ ఈశాన్య పట్కా ధరించలేదని బీజేపీ ఎదురుదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రొటోకాల్ అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య రగడగా మారింది. సోమవారం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గ్రాండ్గా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వేడుకల్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు మూడో వరుసలో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని ఆరోపించింది. ఈ సందర్భంగా 2014లో ఎల్కే అద్వానీ ప్రతిపక్ష నేత కాకపోయినా ముందు వరుసలో సీటు ఏర్పాటు చేసినట్లుగా అప్పటి ఫొటోను కాంగ్రెస్ విడుదల చేసింది.

Also Read
- NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్లో టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం!
- Insurance Murder Case : రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తని చంపింది.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు!
- US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
- Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఇక సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యూరోపియన్ అతిథులతో పాటు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేంద్రమంత్రులు, వీఐపీలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం నుంచి కూడా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇక దీనికి కౌంటర్గా బీజేపీ విమర్శలకు దిగింది. ప్రతిపక్ష నాయకులను అవమానించలేదని బీజేపీ పేర్కొంది. రాహుల్గాంధీనే ఈశాన్య ప్రాంత పట్కా ధరించలేదని ఆరోపించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరినప్పటికీ పట్కా ధరించలేదని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలపై అసహనం కారణంగానే రాహుల్ గాంధీ ఇలా చేశారని ఆరోపించింది. మోడీ, ఖర్గే సహా అందరూ పట్కా ధరించారని.. రాహుల్ గాంధీనే ధరించిలేదని పేర్కొంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ కౌంటర్..
ఇక బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ సంగతి పక్కన పెట్టండి.. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ గొడవేంటి? అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్రమంత్రి ఎందుకు పట్కా ధరించలేదని నిలదీసింది. ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పట్కా ఎందుకు ధరించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తోందని.. ఇది బీజేపీ మనస్తత్వం అని ధ్వజమెత్తింది.

#WATCH | Delhi | Lok Sabha LoP Rahul Gandhi and Congress National President and Rajya Sabha LoP Mallikarjun Kharge seen at the Rashtrapati Bhavan at yesterday's 'At Home' ceremony on the occassion of the 77th Republic Day. pic.twitter.com/f7EgCGslfR
— ANI (@ANI) January 27, 2026
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ ‘ఓజీ -2’లో రెబల్ స్టార్?
-
Janasena Party: జనసేనలో చేరికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. 14 మందితో జాయినింగ్స్ కమిటీ!
-
Whale Graveyard : నీటి అట్టడుగున 53 లక్షల సంవత్సరాల నాటి తిమింగలాల శ్మశాన వాటిక… ఎక్కడుందో తెలుసా ?
-
Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
-
CM Chandrababu: సింగపూర్లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకావిష్కరణ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?