Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..
- రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం..
- రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ ఫైర్..
- బీహార్ ఎన్నికల కోసం మోడీ రైల్వే టికెట్లపై ప్రచారం చేసుకుంటున్నారు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఎక్స్ వేదికగా ఒక ఫొటోను షేర్ చేశాడు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్ పై ప్రధాని మోడీ ఫొటోతో పాటు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ప్రకటన దర్శనమిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆయన రాసుకొచ్చారు.
Read Also: Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
అయితే, ఆపరేషన్ సింధూర్ను రైల్వే టికెట్లపై ప్రకటన చేయడం దారుణం.. మన సైన్యం పరాక్రమాన్ని ఓ ఉత్పత్తిలా మార్చేశారు అని కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ మండిపడ్డారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే అని ఆరోపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే సైన్యాన్ని ఉపయోగించుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ విషయంపై బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ సైతం స్పందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఎన్నికల కోసం అవకాశంగా మార్చుకుంటుందని ఆరోపించారు.
Read Also: Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం
ఇక, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ను భారత సైనిక దళాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు గర్విస్తున్నాం అన్నారు. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్ చేసి.. ఆపరేషన్ సింధూర్ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని రైల్వే స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది అని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం.. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు.
मोदी सरकार किस क़दर विज्ञापनजीवी है इसका उदाहरण देखिए कि रेलवे टिकट पर ऑपरेशन सिंदूर को मोदी के विज्ञापन के तौर पर इस्तेमाल किया जा रहा है।
ये सेना के पराक्रम को भी प्रोडक्ट की तरह बेच रहे हैं। इनसे देशभक्ति नहीं सौदेबाज़ी ही हो सकती है। @INCIndia pic.twitter.com/XPcf9O7REB— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 18, 2025
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!