Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..
- రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం..
- రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ ఫైర్..
- బీహార్ ఎన్నికల కోసం మోడీ రైల్వే టికెట్లపై ప్రచారం చేసుకుంటున్నారు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఎక్స్ వేదికగా ఒక ఫొటోను షేర్ చేశాడు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్ పై ప్రధాని మోడీ ఫొటోతో పాటు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ప్రకటన దర్శనమిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆయన రాసుకొచ్చారు.
Read Also: Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అయితే, ఆపరేషన్ సింధూర్ను రైల్వే టికెట్లపై ప్రకటన చేయడం దారుణం.. మన సైన్యం పరాక్రమాన్ని ఓ ఉత్పత్తిలా మార్చేశారు అని కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ మండిపడ్డారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే అని ఆరోపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే సైన్యాన్ని ఉపయోగించుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ విషయంపై బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ సైతం స్పందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఎన్నికల కోసం అవకాశంగా మార్చుకుంటుందని ఆరోపించారు.
Read Also: Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం
ఇక, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ను భారత సైనిక దళాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు గర్విస్తున్నాం అన్నారు. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్ చేసి.. ఆపరేషన్ సింధూర్ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని రైల్వే స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది అని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం.. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు.
मोदी सरकार किस क़दर विज्ञापनजीवी है इसका उदाहरण देखिए कि रेलवे टिकट पर ऑपरेशन सिंदूर को मोदी के विज्ञापन के तौर पर इस्तेमाल किया जा रहा है।
ये सेना के पराक्रम को भी प्रोडक्ट की तरह बेच रहे हैं। इनसे देशभक्ति नहीं सौदेबाज़ी ही हो सकती है। @INCIndia pic.twitter.com/XPcf9O7REB— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 18, 2025
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?