Congress vs BJP: రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం.. బీజేపీపై కాంగ్రెస్ ఆగ్రహం..
- రైల్వే టికెట్లపై ఆపరేషన్ సింధూర్ ప్రచారం..
- రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ ఫైర్..
- బీహార్ ఎన్నికల కోసం మోడీ రైల్వే టికెట్లపై ప్రచారం చేసుకుంటున్నారు: కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BJP: ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. తాజాగా రైల్వే ఈ- టికెట్లపై ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఎక్స్ వేదికగా ఒక ఫొటోను షేర్ చేశాడు. భారతీయ రైల్వేకి సంబంధించిన ఈ-టికెట్ పై ప్రధాని మోడీ ఫొటోతో పాటు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన ప్రకటన దర్శనమిస్తుంది. మోడీ ప్రభుత్వానికి ప్రకటనలపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని ఆయన రాసుకొచ్చారు.
Read Also: Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
అయితే, ఆపరేషన్ సింధూర్ను రైల్వే టికెట్లపై ప్రకటన చేయడం దారుణం.. మన సైన్యం పరాక్రమాన్ని ఓ ఉత్పత్తిలా మార్చేశారు అని కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ మండిపడ్డారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే అని ఆరోపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసమే సైన్యాన్ని ఉపయోగించుకోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇలాంటి పద్ధతులను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఈ విషయంపై బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ సైతం స్పందించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ఎన్నికల కోసం అవకాశంగా మార్చుకుంటుందని ఆరోపించారు.
Read Also: Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’పై సర్కార్ కీలక నిర్ణయం
ఇక, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ను భారత సైనిక దళాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించినందుకు గర్విస్తున్నాం అన్నారు. దేశం మొత్తం వారి ధైర్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. భారతీయ రైల్వే ఈ సందేశాన్ని టికెట్లపై హైలెట్ చేసి.. ఆపరేషన్ సింధూర్ను ప్రదర్శించే త్రివర్ణ పతాకాలను అన్ని రైల్వే స్టేషన్లలో ఉంచాలని నిర్ణయించింది అని తేల్చి చెప్పారు. ఈ ఆపరేషన్ గురించి దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలని మేము భావిస్తున్నాం.. అంతే తప్ప ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు.
मोदी सरकार किस क़दर विज्ञापनजीवी है इसका उदाहरण देखिए कि रेलवे टिकट पर ऑपरेशन सिंदूर को मोदी के विज्ञापन के तौर पर इस्तेमाल किया जा रहा है।
ये सेना के पराक्रम को भी प्रोडक्ट की तरह बेच रहे हैं। इनसे देशभक्ति नहीं सौदेबाज़ी ही हो सकती है। @INCIndia pic.twitter.com/XPcf9O7REB— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) May 18, 2025
తాజావార్తలు
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!