Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
- డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నం..
- నిందితులపై చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
- బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పిన అలహాబాద్ హైకోర్టు..
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది. అయితే, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడం, వ్యాప్తి చేసే హక్కును ఇచ్చినప్పటికీ, బలవంతపు మత మార్పిడులకు మాత్రం మద్దతు ఇవ్వదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద నిందితులుగా ఉన్న నలుగురిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ వినోద్ దివాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
అయితే, డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని మోసపూరిత హామీలతో ప్రజలను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మార్చడానికి కొందరు నిందితులు ప్రయత్నించారు. దీంతో వారిపై యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేద చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారు.. కానీ, మత ప్రచారం ముసుగులో బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు.
Read Also: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్.. 200 బిలియన్ డాలర్ల సాయం..!
ఇక, మత స్వేచ్ఛను వినియోగించుకోవడం వల్ల సామాజిక నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొనింది. ఒక మతం మరొక మతం కంటే స్వతహాగా ఉన్నతమైనదనే భావన, ఆ మతంలోని నైతిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది అన్నారు. ఇటువంటి భావన రాజ్యాంగంలోని లౌకికవాద ఆలోచనకు విరుద్ధం అని తెలిపారు. భారత్ లౌకికవాదం దేశం అన్ని మతాలకు సమాన గౌరవం అనే సూత్రంలో నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు.. అన్ని మతాలు సమాన దూరాన్ని కొనసాగించాలని జస్టిస్ వినోద్ దివాకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!