Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..
- డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నం..
- నిందితులపై చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
- బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పిన అలహాబాద్ హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forced Conversion: బలవంతంగా మతం మార్చడం తీవ్రమైన అంశమేనని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనింది. భారతదేశంలో నివాసం ఉంటున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ముందుకు నడుచుకోవాలని సూచించింది. అయితే, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించడం, వ్యాప్తి చేసే హక్కును ఇచ్చినప్పటికీ, బలవంతపు మత మార్పిడులకు మాత్రం మద్దతు ఇవ్వదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021 కింద నిందితులుగా ఉన్న నలుగురిపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలన్న పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ వినోద్ దివాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
అయితే, డబ్బు, ఉచిత వైద్యం అందిస్తామని మోసపూరిత హామీలతో ప్రజలను హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మార్చడానికి కొందరు నిందితులు ప్రయత్నించారు. దీంతో వారిపై యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేద చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వినోద్ దివాకర్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛ హక్కును కలిగి ఉన్నారు.. కానీ, మత ప్రచారం ముసుగులో బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు.
Read Also: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్ ఛాలెంజ్.. 200 బిలియన్ డాలర్ల సాయం..!
ఇక, మత స్వేచ్ఛను వినియోగించుకోవడం వల్ల సామాజిక నిర్మాణం దెబ్బతినకుండా చూడాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొనింది. ఒక మతం మరొక మతం కంటే స్వతహాగా ఉన్నతమైనదనే భావన, ఆ మతంలోని నైతిక, ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని స్పష్టంగా సూచిస్తుంది అన్నారు. ఇటువంటి భావన రాజ్యాంగంలోని లౌకికవాద ఆలోచనకు విరుద్ధం అని తెలిపారు. భారత్ లౌకికవాదం దేశం అన్ని మతాలకు సమాన గౌరవం అనే సూత్రంలో నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు.. అన్ని మతాలు సమాన దూరాన్ని కొనసాగించాలని జస్టిస్ వినోద్ దివాకర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!