Rajiv Yuva Vikasam : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. లక్షల సంఖ్యలో యువత ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకంలో ఇటీవల ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 44,800 దరఖాస్తులు అందాయి. వాటిని మూడు ఉపవర్గాలుగా విభజించి..1, 9, 5 శాతం రిజర్వేషన్ల విధానం ప్రకారం ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. అధికారుల వివరాల ప్రకారం, SC గ్రూప్-B నుండి అత్యధిక దరఖాస్తులు వచ్చాయి.
Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
త్వరలో ఈ దరఖాస్తులపై కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టి, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక అనంతరం, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు యూనిట్ మంజూరు పత్రాలను అధికారికంగా అందించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు రూ.6,000 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Forced Conversion: బలవంతపు మత మార్పిడికి రాజ్యాంగం మద్దతు ఇవ్వదు..