PM Modi: దేశాన్ని జూన్ 4న తగలబెట్టాలనుకున్నారు.. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి..
- జూన్ 4న దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నారు..
- రాహుల్ బెయిల్పై బయట ఉన్నారు..
- దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ కుట్ర..
- రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో విమర్శలు చేశారు. ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను కూడా దాటేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ఓ పాఠం నేర్పిందని చెప్పారు. ఎన్డీయేను ఓడించామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని, వారు ఓటమిపై అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మిత్ర పక్షాల సాయంతో కొన్ని సీట్లను గెలుచుకుందాని అన్నారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని చెప్పారు. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ కేవలం 26 శాతమే అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రతీ ఎన్నికల్లో మిత్రపక్షాల ఓట్లను తినే పరాన్నజీవి అని అన్నారు.
Read Also: Assam Flood: అస్సాంను ముంచెత్తిన భారీ వరదలు.. 45కి చేరిన మృతులు
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ, ఆయన సభలో కన్నుకొడుతారు, కౌగిలించుకుంటారు, చిన్నపిల్లాడి మనస్తత్వమని, ఆయనకు పరిపక్వత లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోందని, అలాంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చిందని అన్నారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించారు. వారు కోరుకున్న ఫలితాలు రాకుంటే జూన్ 4న దేశాన్ని తగలబెట్టాలని అనుకున్నట్లు పలు వేదికల నుంచి ప్రకటించిందని చెప్పారు. అరాచకాన్ని వ్యాప్తి చేయాలని చూశారని అన్నారు. భాషా ప్రాతిపదికన ఉత్తరాది, దక్షిణాదిని విభజిస్తోందని, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కూడా ఇదే విధంగా ప్రేరేపిస్తోందని ప్రధాని ఆరోపించారు.
సానుభూతి పొందేందుకు కొత్త డ్రామాలకు కాంగ్రెస్ తెరతీసిందని ప్రధాని మోడీ అన్నారు. వేల కోట్ల అవినీతి కేసులో రాహుల్ గాంధీ బెయిల్పై ఉన్నారని, ఓబీసీ ప్రజలను దొంగలన్న కేసులో బాధ్యతరాహిత్యంగా మాట్లాడినందుకు సుప్రీంకోర్టులో క్షమాపనలు చెప్పాల్సి వచ్చిందని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!