PM Modi: మీకు 100కి 99 కాదు, 543కి 99 వచ్చాయి.. కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి..
- లోక్సభలో ప్రధాని పవర్ ఫుల్ స్పీచ్..
- కాంగ్రెస్పై విరుచుకుపడిన మోడీ..
- మీకు 100కి కాదు 543కి 99 సీట్లు వచ్చాయి..
- కాంగ్రెస్ది చెత్త ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పవర్ఫుల్ స్పీచ్తో విపక్షాలను ఢిపెన్స్లో పడేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, ఉగ్రవాద దాడులను గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని అణిచివేశామని, ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేశాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఆరాధించే వారు, ఓటు బ్యాంకు రాజకీయాలనున ఆయుధంగా మార్చుకున్నారని, అక్కడ ప్రజల హక్కుల్ని అణిచివేశారని అన్నారు. రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు కాలేదని అన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని డ్యాన్స్ చేసే వారు జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ రోజు అక్కడ ఆర్టికల్ 370 గోడ బద్ధలైందని, రాళ్లదాడి ఆగిపోయిందని చెప్పారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి ఈ దేశ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆదేశం ఇచ్చారని, మీరు అక్కడే కూర్చోండి, అరవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కి ముందు ఈ దేశం ఏం చేయలేదనే భావన ప్రజల్లో నెలకొని ఉండేదని, ఇప్పుడు దాన్ని మార్చేశామని అన్నారు. ఈ దేశం తలుచుకుంటే ప్రతీది సాధ్యమే అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దేశం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, మొబైల్ ఫోన్లలో అతిపెద్ద తయారీదారుగా ఎదిగిందని చెప్పారు. ఇప్పుడు దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు.
ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. చిల్లర రాజకీయాలు దేశంలో నడవవని చెప్పారు. బీజేపీ కేరళలో ఈ సారి ఖాతా తెరిచిందని చెప్పారు. తమిళనాడులో చాలా చోట్ల బీజేపీ తన ముద్ర చాటుకుందని చెప్పారు. కర్ణాటక, యూపీ, రాజస్థాన్లో బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పారు. వచ్చే రోజులు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రాలేదని, దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారని అన్నారు. కాంగ్రెస్కి ఇది మూడో అత్యంత దరిద్ర ప్రదర్శన అని అన్నారు.
- Tags
- bjp
- congress
- Parliament
- PM Modi
తాజావార్తలు
-
Sing-Geetham : ‘సింగ్-గీతమ్’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
-
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!