PM Modi: మీకు 100కి 99 కాదు, 543కి 99 వచ్చాయి.. కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి..
- లోక్సభలో ప్రధాని పవర్ ఫుల్ స్పీచ్..
- కాంగ్రెస్పై విరుచుకుపడిన మోడీ..
- మీకు 100కి కాదు 543కి 99 సీట్లు వచ్చాయి..
- కాంగ్రెస్ది చెత్త ప్రదర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పవర్ఫుల్ స్పీచ్తో విపక్షాలను ఢిపెన్స్లో పడేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, ఉగ్రవాద దాడులను గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని అణిచివేశామని, ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేశాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఆరాధించే వారు, ఓటు బ్యాంకు రాజకీయాలనున ఆయుధంగా మార్చుకున్నారని, అక్కడ ప్రజల హక్కుల్ని అణిచివేశారని అన్నారు. రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు కాలేదని అన్నారు. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని డ్యాన్స్ చేసే వారు జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ రోజు అక్కడ ఆర్టికల్ 370 గోడ బద్ధలైందని, రాళ్లదాడి ఆగిపోయిందని చెప్పారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
2024 ఎన్నికల్లో కాంగ్రెస్కి ఈ దేశ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోవాలని ఆదేశం ఇచ్చారని, మీరు అక్కడే కూర్చోండి, అరవండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కి ముందు ఈ దేశం ఏం చేయలేదనే భావన ప్రజల్లో నెలకొని ఉండేదని, ఇప్పుడు దాన్ని మార్చేశామని అన్నారు. ఈ దేశం తలుచుకుంటే ప్రతీది సాధ్యమే అని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దేశం ఇప్పుడు ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, మొబైల్ ఫోన్లలో అతిపెద్ద తయారీదారుగా ఎదిగిందని చెప్పారు. ఇప్పుడు దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు.
ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారు. చిల్లర రాజకీయాలు దేశంలో నడవవని చెప్పారు. బీజేపీ కేరళలో ఈ సారి ఖాతా తెరిచిందని చెప్పారు. తమిళనాడులో చాలా చోట్ల బీజేపీ తన ముద్ర చాటుకుందని చెప్పారు. కర్ణాటక, యూపీ, రాజస్థాన్లో బీజేపీ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్పారు. వచ్చే రోజులు మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100కి 99 రాలేదని, 543 సీట్లకు 99 వచ్చాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు రాలేదని, దేశ రాజకీయాల్లో ఇదే మొదటిసారని అన్నారు. కాంగ్రెస్కి ఇది మూడో అత్యంత దరిద్ర ప్రదర్శన అని అన్నారు.
- Tags
- bjp
- congress
- Parliament
- PM Modi
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!