Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
- ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం..
- మూడు హైడ్రాలిక్ హెచ్చరికలు, ఆటోపైలట్ ఆఫ్..
- టర్బులెన్స్ కారణంగా 300 అడుగులు కిందకు దిగిన విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాలిలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఏకంగా విమానం 300 అడుగులకు పడిపోయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం AI2379 ప్రమాదంపై దర్యాప్తు మరింత వేగవంతమైంది. విమానం ఢిల్లీలో ల్యాండైన తర్వాత రూపొందించిన మెయింటనెన్స్ రిపోర్టులో స్వల్ప వ్యవధిలోనే 3 హైడ్రాలిక్ ప్రెజర్ అలర్ట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్ A320 (VT-EXO) విమానంలో గ్రీన్, ఎల్లో, బ్లూ హైడ్రాలిక్ వ్యవస్థల్లో లో-ప్రెజర్ హెచ్చరికలు నమోదయ్యాయి. వీటి తర్వాత కొద్దిసేపటికే ‘‘ఆటోపైలట్’’ డిస్కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో నమోదైంది. విమానంలో మరోసారి ఆటోపైలట్ వార్నింగ్ నమోదైంది. దీనిని బట్టి చూస్తే మొదట డిస్కనెక్ట్ తర్వాత, ఆటోపైలట్ తిరిగి యాక్టివేట్ అయి, మళ్లీ డిస్ఎంగేజ్ అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
టర్బులెన్స్తో సంబంధం ఉందా..?
ఆగస్టు 4న జరిగిన ఈ ప్రమాదానికి తీవ్రమైన టర్బులెన్స్తో సుమారు 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకు దిగింది. ఈ టర్బులెన్స్ ఘటనకు హైడ్రాలిక్ వార్నింగ్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్, ఇతర సిస్టమ్స్ సందేశాలకు ఏదైనా సంబంధం ఉందనా అని అధికారులు పరిశీలిస్తున్నారు. మెయింటనెన్స్ రిపోర్టులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, ఇతర విమాన వ్యవస్థలకు సంబంధించిన హెచ్చరికలు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ మెయింటెనెన్స్ రికార్డును డీజీసీఏ (DGCA), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
హడలిపోయిన ప్రయాణికులు..
ప్రమాదం సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు శిశువులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. టర్బులెన్స్ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ఒక్కసారిగా విమానం 300 అడుగులు దిగడంతో ప్రయాణికుల్లో కొందరికి మెడ, వెన్నెముకకు గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొలి హైడ్రాలిక్ వార్నింగ్ వచ్చిన తర్వాత విమానం 1గంట 20 నిమిషాలు ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
పైలట్ డ్రగ్ టెస్ట్పై విచారణ..
ఈ ఘటన తర్వాత విమాన కమాండర్కు నిర్వహించిన కన్ఫర్మేషన్ ల్యాబోరేటరీ టెస్టుల్లో గంజాయి తీసుకున్నట్లు తేలిందని సమాచారం. ఇద్దరు పైలట్లకు తప్పనిసరిగా సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ పరీక్షలు నిర్వహించగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరిని ఫ్లయింగ్ డ్యూటీ నుంచి తప్పించారు. అయితే, ఈ ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని ఇప్పటి వరకు స్పష్టంగా తేలలేదు.
తాజావార్తలు
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
-
Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
-
Chadalawada : పదవులు కావాల్సింది సీఎంల పక్కన ఫోటోలకా?
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!