Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
- ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం..
- మూడు హైడ్రాలిక్ హెచ్చరికలు, ఆటోపైలట్ ఆఫ్..
- టర్బులెన్స్ కారణంగా 300 అడుగులు కిందకు దిగిన విమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Flight: ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం గాలిలోనే తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఏకంగా విమానం 300 అడుగులకు పడిపోయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం AI2379 ప్రమాదంపై దర్యాప్తు మరింత వేగవంతమైంది. విమానం ఢిల్లీలో ల్యాండైన తర్వాత రూపొందించిన మెయింటనెన్స్ రిపోర్టులో స్వల్ప వ్యవధిలోనే 3 హైడ్రాలిక్ ప్రెజర్ అలర్ట్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎయిర్ బస్ A320 (VT-EXO) విమానంలో గ్రీన్, ఎల్లో, బ్లూ హైడ్రాలిక్ వ్యవస్థల్లో లో-ప్రెజర్ హెచ్చరికలు నమోదయ్యాయి. వీటి తర్వాత కొద్దిసేపటికే ‘‘ఆటోపైలట్’’ డిస్కనెక్ట్ అయినట్లు రికార్డుల్లో నమోదైంది. విమానంలో మరోసారి ఆటోపైలట్ వార్నింగ్ నమోదైంది. దీనిని బట్టి చూస్తే మొదట డిస్కనెక్ట్ తర్వాత, ఆటోపైలట్ తిరిగి యాక్టివేట్ అయి, మళ్లీ డిస్ఎంగేజ్ అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
టర్బులెన్స్తో సంబంధం ఉందా..?
ఆగస్టు 4న జరిగిన ఈ ప్రమాదానికి తీవ్రమైన టర్బులెన్స్తో సుమారు 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందకు దిగింది. ఈ టర్బులెన్స్ ఘటనకు హైడ్రాలిక్ వార్నింగ్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్, ఇతర సిస్టమ్స్ సందేశాలకు ఏదైనా సంబంధం ఉందనా అని అధికారులు పరిశీలిస్తున్నారు. మెయింటనెన్స్ రిపోర్టులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, ఇతర విమాన వ్యవస్థలకు సంబంధించిన హెచ్చరికలు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ మెయింటెనెన్స్ రికార్డును డీజీసీఏ (DGCA), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
- Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
హడలిపోయిన ప్రయాణికులు..
ప్రమాదం సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు శిశువులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. టర్బులెన్స్ ఘటనలో 20 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది గాయపడ్డారు. ఒక్కసారిగా విమానం 300 అడుగులు దిగడంతో ప్రయాణికుల్లో కొందరికి మెడ, వెన్నెముకకు గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొలి హైడ్రాలిక్ వార్నింగ్ వచ్చిన తర్వాత విమానం 1గంట 20 నిమిషాలు ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
పైలట్ డ్రగ్ టెస్ట్పై విచారణ..
ఈ ఘటన తర్వాత విమాన కమాండర్కు నిర్వహించిన కన్ఫర్మేషన్ ల్యాబోరేటరీ టెస్టుల్లో గంజాయి తీసుకున్నట్లు తేలిందని సమాచారం. ఇద్దరు పైలట్లకు తప్పనిసరిగా సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ పరీక్షలు నిర్వహించగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇద్దరిని ఫ్లయింగ్ డ్యూటీ నుంచి తప్పించారు. అయితే, ఈ ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని ఇప్పటి వరకు స్పష్టంగా తేలలేదు.
తాజావార్తలు
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
-
Solar Eclipse 2026: మరికొన్ని గంటల్లో సూర్య గ్రహణం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..
-
karnataka: మంత్రులకు శాఖలు కేటాయింపు.. డీకే.శివకుమార్ దగ్గరే కీలక శాఖ
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..