Himanta Biswa Sarma: అప్పుడు సైలెంట్గా ఉండీ.. శాంతి నెలకొనే టైంలో కాంగ్రెస్ ఏడుస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: మణిపూర్ ఘర్షణలు మరో 10 రోజుల్లో తగ్గుముఖం పడుతాయని, రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ అన్నారు. కేంద్ర హోం శాఖ, మణిపూర్ ప్రభుత్వాలు గత రెండు నెలల నుంచి జరుగుతున్న ఘర్షణలను తగ్గించేందుకు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ మౌనంగా ఉండీ.. శాంతి నెలకొనే సమయంలో ఏడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘర్షణ సమయంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లలేదని, శాంతి నెలకొనే సమయంలో అక్కడికి వెళ్లారని దుయ్యబట్టారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఒక నెల క్రితంతో పోలిస్తే మణిపూర్ లో పరిస్థితి మెరుగుపడిందని, నేను గ్యారంటీగా ఈ విషయం చెబుతున్నానని హిమంత అన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా శుక్రవారం రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ పర్యటనను ‘రాబందుల పర్యటన’గా అభివర్ణించారు.
గత రెండు నెలలుగా మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణ జరగుతోంది. మే 3న ఈ అల్లర్లు ప్రారంభమయ్యాయి. మైయిటీ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వద్దని కుకీ, నాగా, ఇతర గిరిజనులు భారీ ర్యాలీ తీశారు. ఈ సమయంలో హింస చెలరేగింది. ముఖ్యంగా మైయిటీ, కుకీ వర్గాల పరస్పరం ఇళ్లను, వాహనాలను తగలబెట్టారు. ఇండియన్ ఆర్మీ పరిస్థితిని చక్కదిద్దడానికి 10,000 మందిని మణిపూర్ లో మోహరించింది. ఈ అల్లర్లలో 100కు పైగా మంది ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో నిరాశ్రయులు అయ్యారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!