West Bengal: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య.. ఉప ఎన్నికల్లో మమతా సర్కార్కు షాక్ తగిలే ఛాన్స్..!
- పశ్చిమ బెంగాల్ లో మమతా సర్కార్ కి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం..
- ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య ఘటనే కారణమంటున్న విశ్లేషకులు..
- అన్ని స్థానాల్లో టీఎంసీ ఓడిపోయే ప్రమాదం ఉందని తెలిపిన రాజకీయ పండితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. నవంబర్ 13న 6 అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు ఆర్జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
ఇక, పశ్చిమ బెంగాల్లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి సపోర్టుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ అంశం దీదీ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
బెంగాల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి కాగా.. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని యత్నిస్తుంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది.
Read Also: Zelensky: రష్యా లో నార్త్ కొరియా ఆర్మీ ఎంట్రీ.. చైనా మౌనంగా ఉండొద్దని జెలెన్ స్కీ వినతి
అయితే, ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..ఆర్జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయని పేర్కొన్నారు. సీపీఐఎం పాలన ఎలా ఉందో బెంగాల్ ప్రజలు చూశారు.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కమలం పాలన ఎలా ఉందో గమనిస్తున్నారని విమర్శించారు. ఇక, ఆర్జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్కతా పోలీసులు 24 గంటల్లో అదులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ పని తీరుకు ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. మేం అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతుంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!