West Bengal: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య.. ఉప ఎన్నికల్లో మమతా సర్కార్కు షాక్ తగిలే ఛాన్స్..!
- పశ్చిమ బెంగాల్ లో మమతా సర్కార్ కి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం..
- ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య ఘటనే కారణమంటున్న విశ్లేషకులు..
- అన్ని స్థానాల్లో టీఎంసీ ఓడిపోయే ప్రమాదం ఉందని తెలిపిన రాజకీయ పండితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. నవంబర్ 13న 6 అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు ఆర్జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
Read Also: Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇక, పశ్చిమ బెంగాల్లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి సపోర్టుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ అంశం దీదీ సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
బెంగాల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయింది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి కాగా.. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని యత్నిస్తుంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది.
Read Also: Zelensky: రష్యా లో నార్త్ కొరియా ఆర్మీ ఎంట్రీ.. చైనా మౌనంగా ఉండొద్దని జెలెన్ స్కీ వినతి
అయితే, ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..ఆర్జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయని పేర్కొన్నారు. సీపీఐఎం పాలన ఎలా ఉందో బెంగాల్ ప్రజలు చూశారు.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కమలం పాలన ఎలా ఉందో గమనిస్తున్నారని విమర్శించారు. ఇక, ఆర్జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్కతా పోలీసులు 24 గంటల్లో అదులోకి తీసుకున్నారు.. ప్రభుత్వ పని తీరుకు ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. మేం అన్నీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలిచారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతుంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!