బంగ్లాదేశ్, కోల్కతాను భూప్రకంపనలు హడలెత్తించాయి. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్లోని నర్సింగ్డి నుంచి 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
కోల్కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు.
Bengal Rape Case: బెంగాల్లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.
పశ్చిమబెంగాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
కోల్కతాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్కతా వీధులన్నీ జలమయం అయ్యాయి. బెనియాపుకూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్పూర్లో వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో జీనజీవనం స్తంభించింది.
Crime: బర్త్ డే పార్టీ అని పిలిచి, ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హరిదేశ్ పూర్కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోల్కతాలో బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును స్వాధీనం చేసుున్నారు.
Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.
Air India flight: టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI357 విమానంలో ప్రయాణికులు, సిబ్బంది క్యాబిన్ లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.