Home
Kolkata
Kolkata News
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు సమీపంలో దారుణ సంఘటన జరిగింది. లవ్ ప్రపోజల్ తిరస్కరించిందే కారణంతో ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో, తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హౌరా జిల్లాలోని అండుల్ ప్రాంతంలో మహియారి ఖతిర్ బజార్లోని చంద్నీ బాగాన్లో ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాలిక సైకిల్పై… -
Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
Taslima Nasrin: ప్రవాసంలో ఉంటున్న వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ 20 ఏళ్ల తర్వాత కోల్కతా రాబోతున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె బెంగాల్ గడ్డపై అడుగుపెడుతున్నారు. తస్లీమా ఆగస్టు 1వ తేదీన రవీంద్ర సదన్లో జరిగే ఛాందసవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొంటున్నారు. ఈ శుభవార్తను తస్లీమా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. లెఫ్ట్ ప్రభుత్వాలు బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా భారీ… -
Kolkata: కోల్కతాలో కూలిన గోదాం.. 8 మంది మృతి
కోల్కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. -
West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు… -
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని తన చేతిలో నుంచి కోల్పోయిన మమతకు ఇప్పుడు ఆమెపై కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. ఒక వర్గం మీకు ఎదురుగా నిలబడితే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక… -
Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
కోల్కతాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 4 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMs) దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఉద్దేశపూర్వకంగా విధ్వంసం సృష్టించారా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. -
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
Explained: బెంగాల్ అంటేనే మేధావుల ఇలాకా... లౌకికవాదం, లెఫ్ట్ భావజాలం, కళలు, సాహిత్యానికి మారుపేరు. అలాంటి గడ్డపై బీజేపీ అడుగుపెట్టడమే కష్టమనుకున్న తరుణంలో ఊహించని విధంగా ఆ పార్టీ జెండా పాతింది. మొన్నటివరకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో, 294 స్థానాలకు గానూ ఏకంగా 208 సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కేవలం 80 స్థానాలకే పరిమితమైన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చడంలో బెంగాలీ సమాజంలో అత్యంత కీలకమైన 'భద్రలోక్'… -
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
అమెరికా విదేశాంగ మంత్రి, ట్రంప్ అగ్ర సహాయకుడు మార్కో రూబియో భారత్లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం ఉదయం కోల్కతా చేరుకున్నారు. గతేడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. -
Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన తొలగింపులు, ఆక్రమణల వ్యతిరేక చర్యలను టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం బుల్డోజర్ రాజకీయాలుగా అభివర్ణించారు. రాజకీయ అహంకారానికి పేద ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ‘ఎక్స్’ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలా పోస్ట్ చేశారు, “కుటుంబాల నుండి వీధి వ్యాపారుల వరకు, పేదలు రాజకీయ అహంకారానికి మూల్యం చెల్లిస్తున్నారు. బెంగాల్లో బుల్డోజర్ రాజకీయాలు పనిచేయవు.… -
Mamata Banerjee: బెంగాల్ను టార్గెట్ చేసినవారు నరకానికి వెళ్తారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్దె దించి, దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. కోల్కతాలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రాన్ని , ఇక్కడి ప్రజలను టార్గెట్ చేస్తున్న వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!