Mohan Bhagwat: పోలికల ద్వారా, రాజకీయ కోణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను అర్థం చేసుకోవడం తరుచుగా అపార్థాలకు దారి తీస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కోల్కతాలో జరిగిన ‘‘ఆర్ఎస్ఎస్ 100 వ్యాఖ్యాన మాల’’ కార్యక్రమంలో ఆయన పఈ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ను కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో ముడిపెట్టవదని ఆయన చెప్పారు. చాలా మంది సంఘ్ను బీజేపీ కోణం…
పొగమంచు కారణంగా ప్రధాని మోడీ హెలికాప్టర్ ప్రయాణం ఆగిపోయింది. మోడీ శనివారం నాడియా జిల్లాలోని తాహెర్పూర్కు వెళ్లాల్సి ఉంది. హైవే ప్రాజెక్టులను ప్రారంభించి.. అనంతరం బీజేపీ పరివర్తన్ సంకల్ప సభలో ప్రసంగించాల్సి ఉంది.
ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రతికూల వాతావరణం ఇబ్బందికి గురి చేసింది. గత కొద్దిరోజులుగా పొగ మంచు కారణంగా ఆయా రాష్ట్రాలు కొట్టిమిట్టాడుతున్నాయి. అయితే శనివారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు.
Kolkata Messi Tour Chaos: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ సీరియస్గా స్పందించారు.
కోల్కతా పర్యటన ముగించుకుని లియోనల్ మెస్సీ హైదరాబాద్కు స్టార్ట్ అయ్యారు. కాగా, సాల్ట్లేక్ స్టేడియంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మెస్సీ.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్, కోల్కతాను భూప్రకంపనలు హడలెత్తించాయి. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.7గా నమోదైంది. బంగ్లాదేశ్లోని నర్సింగ్డి నుంచి 14 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
కోల్కతా ఆర్జీ కర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అతడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల మేనకోడలు సురంజనా సింగ్ అల్మారాలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు.
Bengal Rape Case: బెంగాల్లోని దుర్గాపూర్ లో మెడిసిన్ విద్యార్థిని అత్యాచార ఘటన మరవక ముందే, మరో ఘటన కోల్కతాలో జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆమె క్లాస్మేట్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని సిటీలోని ఆనందపూర్ ప్రాంతం నుంచి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.
పశ్చిమబెంగాల్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.